Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పేరుకే వైద్యులు.. భర్త విడాకుల నోటీస్ ఇచ్చాడని.. భార్య ఏం చేసిందంటే?

భర్త విడాకుల నోటీస్ ఇచ్చాడని భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బెంగుళూరు నగరంలోని నందిని లేఅవుట్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భార్యాభర్తలు వైద్యులు.

పేరుకే వైద్యులు.. భర్త విడాకుల నోటీస్ ఇచ్చాడని.. భార్య ఏం చేసిందంటే?
, బుధవారం, 17 అక్టోబరు 2018 (13:11 IST)
భర్త విడాకుల నోటీస్ ఇచ్చాడని భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బెంగుళూరు నగరంలోని నందిని లేఅవుట్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భార్యాభర్తలు వైద్యులు. ఆమె పేరు అశ్వనీ. బెంగుళూరు మున్సిపల్ కార్పొరేషన్ వైద్యాధికారిణిగా పనిచేస్తుండేది. అశ్వనీకి సంవత్సరం క్రితం డాక్టర్ రోహిత్‌తో పెళ్లయింది.
 
ఇద్దరి మధ్య విబేధాలు వచ్చిన కారణంగా అశ్వని తన పుట్టింటికి వెళ్లిపోయింది. దాంతో భర్త ఆమెకు విడాకుల నోటిసును ఇంటికి పంపించాడు. ఈ ఆవేదనను తట్టుకోలేక అశ్వినీ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్ నోట్‌లో సారీ అని రాసిపెట్టింది. 
 
అశ్వనీ ఆత్మహత్య చేసుకోవడంతో.. ఆమె భర్త కట్నం కోసం వేధిస్తున్నాడని.. అందుకే ఆమె ఆత్మహత్య చేసుకుందని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్నికలంటే.. కొన్ని పార్టీలకు గేమ్.. టీఆర్ఎస్‌కి మాత్రం టాస్క్- కేసీఆర్