ఆ రెండు పార్టీలు రాజీనామాలు చేసి వెళ్ళిపోండి.. లేదా కలిసి చావండి: తమ్మారెడ్డి

ఏపీలోని రెండు రాజకీయా పార్టీలు రాజీనామాలు చేసి వెళ్ళిపోండి.. మేమే చూసుకుంటాం అని సినీ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. తానీ ఏ రాజకీయపార్టీకి చెందిన వాడిని కాదని.. తెలుగు ప్రజల శ్రేయస్సే

Webdunia
గురువారం, 19 ఏప్రియల్ 2018 (10:10 IST)
ఏపీలోని రెండు రాజకీయా పార్టీలు రాజీనామాలు చేసి వెళ్ళిపోండి.. మేమే చూసుకుంటాం అని సినీ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. తానీ ఏ రాజకీయపార్టీకి చెందిన వాడిని కాదని.. తెలుగు ప్రజల శ్రేయస్సే తనకు కావాలన్నారు.

టీడీపీ వాళ్లు వైసీపీ నేతలను తిట్టడం, తిరిగి వైసీపీ వాళ్లు టీడీపీ వాళ్లను తిట్టడం ఫ్యాషనైపోయిందని తమ్మారెడ్డి ధ్వజమెత్తారు. నిజంగా వీరికి చిత్తశుద్ధి ఉంటే ఒకరినొకరు తిట్టుకోకూడదని.. మీరు తిట్టుకుంటుంటే.. వాటిని వినడానికా తామున్నది అంటూ తమ్మారెడ్డి ప్రశ్నించారు. 
 
ప్రజలు మంచి జరుగుతుందనే ఉద్దేశ్యంతోనే ఓట్లు వేశామన్నారు. రెండు పార్టీలూ దొంగలే అని వాళ్ల తిట్లు వింటుంటే అసహ్యం వేస్తోందని మండిపడ్డారు. రాజీనామాలు చేసి వెళ్లిపోండి.. మేమే చూసుకుంటామన్నా.. అది మాత్రం చేయరు. పదవులను పట్టుకుని వేలాడుతూ.. ఒకరినొకరు తిట్టుకుంటూ సమయాన్ని గడిపేస్తారని తమ్మారెడ్డి అన్నారు. నాలుగేళ్లు గడిచిపోయాయి. ఈ సంవత్సరమన్నా కలిసి చావండి, రాష్ట్రానికి బాగుంటుందని తమ్మారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments