Webdunia - Bharat's app for daily news and videos

Install App

మర్కజ్ భవనం శుద్ధి.... 617 మందిలో కరోనా లక్షణాలు

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2020 (19:22 IST)
ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ భవనంలో ఉన్న ముస్లిం మతపెద్దలను ఖాళీ చేయించి, ఆ ప్రాంతాన్ని శుద్ధి చేశారు. ఈ భవనం నుంచి మొత్తం 2361 మందిని క్వారంటైన్‌కు తరలించారు. వీరిలో 617 మందికి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్టు సమాచారం. ఈ విషయాన్ని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తెలిపారు. 
 
ఈ మర్కజ్ మసీదు వేదికగా ఇటీవల మతపరమైన ప్రార్థనలు జరిగాయి. ఇక్కడు కరోనా బాధిత దేశాల నుంచి అనేక మంది ప్రతినిధులు వచ్చారు. ఈ సదస్సుకు హాజరై తమతమ ప్రాంతాలకు తిరిగివెళ్లిన వారి నుంచే ఈ వైరస్ దేశ వ్యాప్తంగా వ్యాపించింది. దీంతో ఈ మర్కజ్ మసీదును పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 
 
పైగా, ఇక్కడ ఉన్న వారందరినీ ఖాళీ చేయించి వివిధ ఆస్పత్రులకు తరలించారు. ఈ తరలింపు కార్యక్రమం ఏకంగా 36 గంటల పాటు సాగింది. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న వారందరికీ మనీష్‌ సిపోడియా కృతజ్ఞతలు తెలిపారు. 
 
ఇకపోతే, ఢిల్లీలోని మర్కజ్‌ భవన్‌తో పాటు పరిసర ప్రాంతాలను సౌత్‌ ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ సిబ్బంది శానిటైజేషన్‌ చేస్తున్నారు. మర్కజ్‌ భవన్‌లో మార్చి 1 నుంచి 15వ తేదీ వరకు జరిగిన మత ప్రార్థనల్లో ఇతర దేశాలకు చెందిన వారితో పాటు మన దేశానికి చెందిన పలువురు ముస్లింలు పాల్గొన్నారు. ఈ ప్రార్థనల్లో సుమారు 3 వేల మందికి పైగా పాల్గొన్నారు. వీరిలో పెక్కు మందికి ఈ వైరస్ సోకింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ధనుష్ చిత్రం జాబిలమ్మ నీకు అంత కోపమా నుంచి రొమాంటిక్ సాంగ్

లైలా లో ఓహో రత్తమ్మ అంటూ సాంగేసుకున్న విశ్వక్సేన్

తండేల్‌ ఫుటేజ్ కు అనుమతినిచ్చిన బన్సూరి స్వరాజ్‌కు ధన్యవాదాలు తెలిపిన బన్నీ వాసు

శ్వేతబసు ప్రసాద్... తాజా ఫోటో షూట్... ఎరుపు రంగు డ్రెస్సుతో అదిరింది

ఛావా దర్శకుడు ప్రతిసారీ కౌగిలించుకుంటుంటే తేడా అనుకున్నా: విక్కీ కౌశల్, రష్మిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

తర్వాతి కథనం
Show comments