Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో నమోదయ్యే కేసులన్నీ మర్కజ్‌ నుంచి వచ్చినవే... సీఎం జగన్

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2020 (18:26 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో 70 శాతం కరోనా కేసులన్ని ఢిల్లీలోని మర్కజ్ సదస్సుకెళ్లి వచ్చినవారి నుంచి వచ్చినవేనని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి చెప్పారు. పైగా, కరోనా వైరస్ సోకినంతమాత్రాన ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. 
 
సీఎం జగన్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ, గత రెండు రోజుల వ్యవధిలో కరోనా కేసులు గణనీయంగా పెరగడం బాధాకరమన్నారు. కరోనా వస్తే తప్పుజరిగినట్లు భావించకూడదని.. ఏపీలో నమోదైన 87 కేసుల్లో 70 కేసులు ఢిల్లీ నుంచి వచ్చినవారికే పాజిటివ్‌ వచ్చిందని గుర్తుచేశారు. 
 
ఈ ఢిల్లీ సదస్సుకు మన రాష్ట్రం నుంచి 1,085 మంది వెళ్లి వచ్చారని, వీరిలో మొత్తం 585 మందికి పరీక్షలు చేశాం, 70 కేసుల్లో పాజిటివ్‌ వచ్చిందని చెప్పారు. మరో 500 కేసుల నివేదికలు రావాల్సి ఉందన్నారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన మరో 21 మంది కోసం గాలింపు చేపట్టామన్నారు. 104కు ఫోన్‌ చేసి స్వచ్ఛందంగా పరీక్షలు చేసుకోవాలన్నారు. 
 
కరోనా వైరస్‌ జ్వరం, ఫ్లూ లాంటిదే, ఎవరూ భయపడొద్దన్నారు. వృద్ధులు, డయాబెటిస్‌, ఇతర సమస్యలున్నవారికి తీవ్రంగా ఉంటుందన్నారు. కరోనా పట్ల అధైర్యపడొద్దు, ఆందోళన చెందవద్దన్నారు. కరోనా ఒకరి నుంచి మరొకరికి సులువుగా సోకుతుందని.. విదేశాల్లో దేశాధినేతలకు కూడా కరోనా సోకింది, నయమైందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments