దేవేంద్ర ఫడ్నవిస్ బలమెంత? లైవ్‌లో 'మహా' బలపరీక్ష

Webdunia
మంగళవారం, 26 నవంబరు 2019 (13:54 IST)
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ వాస్తవబలమెంతో బుధవారం తేలిపోనుంది. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు బుధవారం ఆ రాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష జరుగనుంది. ఇందులో విజయం సాధిస్తే దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. లేనిపక్షంలో తన పదవికి రాజీనామా చేయాల్సివస్తుంది. 
 
కాగా, మహారాష్ట్రలో ఎన్సీపీ నేత అజిత్ పవార్‌ మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వ్యతిరేకంగా విపక్షాలు సుప్రీంకోర్టుకెళ్లాయి. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు...కీలక ఆదేశాలు జారీచేసింది. బీజేపీ కూటమికి బలం ఉంటే, వెంటనే అసెంబ్లీని సమావేశపరచాలని, బల పరీక్షకు సిద్ధం కావాలని ఆదేశించింది. 
 
తమకు బలం ఉందని చెబుతూ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా ఆలస్యం చేయడం ఏంటని ఈ సందర్భంగా న్యాయమూర్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బల పరీక్ష అసెంబ్లీ వేదికగా జరగాలే తప్ప, రాజ్‌భవన్‌లో కాదని అన్నారు. బుధవారం సాయంత్రం 5 గంటల్లోగా విశ్వాస పరీక్ష జరగాలని ఆదేశించారు. 
 
పైగా, బల పరీక్షను సజావుగా నిర్వహించేందుకు ప్రొటెమ్ స్పీకర్‌ను తక్షణమే నియమించాలని, మొత్తం అసెంబ్లీ సమావేశాలను చిత్రీకరిస్తూ, లైవ్ టెలికాస్ట్ చేయాలని కూడా ఆదేశించించింది. బుధవారం ఉదయం నుంచి సాయంత్రంలోగా ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం పూర్తి కావాలని, ఆ వెంటనే బల పరీక్ష జరపాలని ఆదేశాలు జారీచేసింది. బల పరీక్షలో రహస్య ఓటింగ్‌ను జరపరాదని కూడా సూచించింది. దీంతో దేవంద్ర ఫడ్నవిస్ తన బలాన్ని అసెంబ్లీ వేదికగా నిరూపించుకోవాల్సి పరిస్థితి ఏర్పడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: రవితేజ, డింపుల్ హయతి.. భర్త మహాశయులకు విజ్ఞప్తి నుంచి మెలోడీ సాంగ్

ఎవరు కొత్త తరహా సినిమా చేసినా ప్రోత్సాహించాలి, లేకుంటే ముందడుగు వేయలేరు : కార్తి

మాకు మనవళ్ళు పుట్టినా నాగార్జున అలానే ఉన్నారు.. యాంటీ ఏజింగ్ టెస్టులు చేయాలి...

విదు, ప్రీతి అస్రాని మ‌ధ్య కెమిస్ట్రీ 29 సినిమాకు ప్ర‌ధానాక‌ర్ష‌ణ

మగాళ్లను మొక్కు కుంటూ కాదు తొక్కు కుంటూ పోతం.. పురుష కొత్త పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తర్వాతి కథనం
Show comments