రూ 10 కోట్లిస్తే ఈవీఎం హ్యాక్ అయిపోతది... ఎన్నికల్లో ఘన విజయం... బాబు సంచలనం

Webdunia
మంగళవారం, 23 ఏప్రియల్ 2019 (19:58 IST)
ఈవీఎంల పనితీరుపై మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రూ. 10 కోట్లిస్తే చాలు ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని షాకింగ్ న్యూస్ చెప్పారు. రష్యాలోని కొందరు వ్యక్తులకు ఈ పవర్ వున్నదనీ, డబ్బిస్తే ప్రజల ఓట్లతో సంబంధం లేకుండా ఈవీఎంలను హ్యాక్ చేసి అభ్యర్థులను గెలిపించేస్తారంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు పెనుదుమారం రేపుతున్నాయి. 
 
కాగా తనదాకా వచ్చిన ఈ సమాచారంలో ఎంతవరకు నిజం ఉందనేది నిగ్గు తేల్చాలంటూ డిమాండ్ చేశారు. కాంగ్రెస్-ఎన్సీపీ కూటమికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో చంద్రబాబు ఇలా వ్యాఖ్యానించారు. ఎన్నికల పర్యటన ముగిసిన అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ... ఎన్నికల సంఘం, ఈవీఎంల పనితీరుపై సంచలన ఆరోపణలు చేశారు. 
 
వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించడం ద్వారా అసలైన లెక్క తేలుతుందనీ, అందువల్ల ఈవీఎంలలో పోలైన ఓట్ల సంగతి అలా వుంచి వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలంటూ డిమాండ్ చేశారు. మరి ఆయన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naresh Agastya: సముద్రంలో 3 నిమిషాల 40 సెకండ్స్ 80 ఫీట్స్ డెప్త్ వెళ్లా : నరేష్ అగస్త్య

కేడి దర్శకుడు కిరణ్ కుమార్ కన్నుమూత.. షాకైన టాలీవుడ్

సూపర్ నేచురల్ థ్రిల్లర్ శంబాల ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న మైత్రి, ఉషా పిక్చర్స్

Anaswara Rajan: టాలీవుడ్ లో కార్ వాన్స్, బడ్జెట్ స్పాన్ చూసి ఆచ్చర్య పోయా : అనస్వర రాజన్

15 యేళ్ళుగా ఆ నొప్పితో బాధపడుతున్నా : అక్కినేని నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ చికిత్స కోసం సిప్లా యుర్పీక్ ప్రారంభం

గాజువాక ప్రభుత్వ పాఠశాలలో నాట్స్ సాయంతో గ్రీన్ స్టూడియో

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

ఉసిరి, నిమ్మకాయతో ఉప్పు.. గుండె ఆరోగ్యంతో పాటు రక్తపోటుకు చెక్

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments