Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ 10 కోట్లిస్తే ఈవీఎం హ్యాక్ అయిపోతది... ఎన్నికల్లో ఘన విజయం... బాబు సంచలనం

Webdunia
మంగళవారం, 23 ఏప్రియల్ 2019 (19:58 IST)
ఈవీఎంల పనితీరుపై మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రూ. 10 కోట్లిస్తే చాలు ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని షాకింగ్ న్యూస్ చెప్పారు. రష్యాలోని కొందరు వ్యక్తులకు ఈ పవర్ వున్నదనీ, డబ్బిస్తే ప్రజల ఓట్లతో సంబంధం లేకుండా ఈవీఎంలను హ్యాక్ చేసి అభ్యర్థులను గెలిపించేస్తారంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు పెనుదుమారం రేపుతున్నాయి. 
 
కాగా తనదాకా వచ్చిన ఈ సమాచారంలో ఎంతవరకు నిజం ఉందనేది నిగ్గు తేల్చాలంటూ డిమాండ్ చేశారు. కాంగ్రెస్-ఎన్సీపీ కూటమికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో చంద్రబాబు ఇలా వ్యాఖ్యానించారు. ఎన్నికల పర్యటన ముగిసిన అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ... ఎన్నికల సంఘం, ఈవీఎంల పనితీరుపై సంచలన ఆరోపణలు చేశారు. 
 
వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించడం ద్వారా అసలైన లెక్క తేలుతుందనీ, అందువల్ల ఈవీఎంలలో పోలైన ఓట్ల సంగతి అలా వుంచి వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలంటూ డిమాండ్ చేశారు. మరి ఆయన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments