ప్రియాంకా గాంధీ ట్విట్టర్ ఖాతా వైరల్.. నిమిషాల్లో వేల సంఖ్యలో ఫాలోయర్లు...

Webdunia
సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (12:46 IST)
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెల్లి ప్రియాంకా గాంధీ వాద్రా తొలిసారి ట్విట్టర్ ఖాతాను తెరిచారు. ఈ ఖాతా ప్రారంభించిన కొన్ని నిమిషాల్లోనే ఆమె ఫాలోయర్ల సంఖ్య వేలల్లో చేరిపోయింది. ఈ ఖాతాను ఆదివారం రాత్రి 10.45 గంటల సమయంలో ఆమె ప్రారంభించగా, ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా వెల్లడించింది. ఆ తర్వాత కొన్ని నిమిషాల వ్యవధిలోనే వెరిఫైడ్ అకౌంట్‌గా ట్విట్టర్ గుర్తించడం విశేషం. 
 
ఆమెకు ట్విట్టర్‌లో రాత్రి నుంచి ఉదయం వరకు 15 వేల మంది ఫాలోవర్లు వచ్చేశారు. ఇప్పటివరకైతే ఆమె ఎలాంటి ట్వీట్ చేయలేదు. అటు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రియాంకా ట్విట్టర్‌లో అడుగుపెట్టిన విషయాన్ని వెల్లడించింది. కాంగ్రెస్ మద్దతుదారులు ఆమెను ట్విట్టర్‌లో ఫాలో కావచ్చని ట్వీట్ చేసింది. 
 
సోషల్ మీడియా వాడకం పెరిగిపోతున్న సమయంలో కొత్తగా పలువురు ప్రముఖ నేతలు ట్విట్టర్ ఖాతాలను తెరుస్తున్నారు. గత నెలలోనే బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా ట్విట్టర్‌లో అడుగుపెట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishnu : శ్రీ విష్ణు, నయన సారిక జంటగా విష్ణు విన్యాసం రాబోతుంది

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ జంట గా చిత్రం ప్రారంభం

Jin: భూతనాల చెరువు నేపథ్యంగా జిన్ మూవీ సిద్దమైంది

నటిపై లైంగిక దాడి కేసు - నిర్దోషిగా మంజు వారియర్ మాజీ భర్త... న్యాయం జరగలేదు...

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ కాంబినేషన్ లో చిత్రం లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

ఉసిరి, నిమ్మకాయతో ఉప్పు.. గుండె ఆరోగ్యంతో పాటు రక్తపోటుకు చెక్

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

తర్వాతి కథనం
Show comments