చైనా సోషల్ మీడియా వైబో నుంచి తప్పుకున్న ప్రధాని మోడీ

Webdunia
బుధవారం, 1 జులై 2020 (19:31 IST)
గాల్వాన్ లోయలో చైనా బలగాలదాడికి నిరసనగా డ్రాగన్ కంట్రీకి చెందిన 59 యాప్‌లపై భారత్ నిషేధం విధించింది. దీంతో భారత్‌లో చైనాకు చెందిన టిక్ టాక్, హలో వంటి అనేక ప్రముఖ యాప్‌లన్నీ మూగబోయాయి. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. చైనా సోషల్ మీడియా వెబ్‌సైట్ 'వైబో' నుంచి మోదీ తప్పుకున్నారు.
 
వైబో అకౌంట్‌లో గతంలో మోడీ పెట్టిన ఫొటోలు, కామెంట్లు, పోస్టులు, ప్రొఫైల్‌ ఫొటోతో సహా పూర్తి వివరాలను తొలగించారు. ప్రస్తుతం ఈ పేజీ పూర్తి బ్లాంక్‌గా కనిపిస్తోంది. అకౌంట్‌లోని సమాచారాన్ని తొలగించే వరకు ప్రధాని ఇప్పటివరకూ 115 పోస్టులు  చేశారు. అన్ని పోస్టులను మాన్యువల్‌గా డిలీట్‌ చేశారు. 
 
వైబోలో మోడీకి 2,44,000 మంది ఫాలోవర్లు ఉండగా, వీరిలో ఎక్కువ మంది చైనీయులే కావడం గమనార్హం. 2015 నుంచి చైనాకు సంబంధించిన  విషయాలను మోడీ వైబోలోనే పంచుకునేవారు. ప్రధానిగా చైనాలో పర్యటించే ముందు 2015లో మోడీ వైబోలో అకౌంట్‌ తెరిచారు. 
 
'హలో చైనా! వైబో ద్వారా చైనా స్నేహితులతో మాట్లాడడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను' అని మోడీ ట్విటర్లో పోస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. చైనాలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ సోషల్ మీడియా వెబ్‌సైట్‌ను చాలా మంది చైనీయులు వినియోగిస్తున్నారు. గాల్వాన్ లోయ ఎఫెక్టు కారణంగా చైనాపై భారత్ సోషల్ మీడియా యుద్ధం ప్రారంభించింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments