Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా సోషల్ మీడియా వైబో నుంచి తప్పుకున్న ప్రధాని మోడీ

Webdunia
బుధవారం, 1 జులై 2020 (19:31 IST)
గాల్వాన్ లోయలో చైనా బలగాలదాడికి నిరసనగా డ్రాగన్ కంట్రీకి చెందిన 59 యాప్‌లపై భారత్ నిషేధం విధించింది. దీంతో భారత్‌లో చైనాకు చెందిన టిక్ టాక్, హలో వంటి అనేక ప్రముఖ యాప్‌లన్నీ మూగబోయాయి. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. చైనా సోషల్ మీడియా వెబ్‌సైట్ 'వైబో' నుంచి మోదీ తప్పుకున్నారు.
 
వైబో అకౌంట్‌లో గతంలో మోడీ పెట్టిన ఫొటోలు, కామెంట్లు, పోస్టులు, ప్రొఫైల్‌ ఫొటోతో సహా పూర్తి వివరాలను తొలగించారు. ప్రస్తుతం ఈ పేజీ పూర్తి బ్లాంక్‌గా కనిపిస్తోంది. అకౌంట్‌లోని సమాచారాన్ని తొలగించే వరకు ప్రధాని ఇప్పటివరకూ 115 పోస్టులు  చేశారు. అన్ని పోస్టులను మాన్యువల్‌గా డిలీట్‌ చేశారు. 
 
వైబోలో మోడీకి 2,44,000 మంది ఫాలోవర్లు ఉండగా, వీరిలో ఎక్కువ మంది చైనీయులే కావడం గమనార్హం. 2015 నుంచి చైనాకు సంబంధించిన  విషయాలను మోడీ వైబోలోనే పంచుకునేవారు. ప్రధానిగా చైనాలో పర్యటించే ముందు 2015లో మోడీ వైబోలో అకౌంట్‌ తెరిచారు. 
 
'హలో చైనా! వైబో ద్వారా చైనా స్నేహితులతో మాట్లాడడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను' అని మోడీ ట్విటర్లో పోస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. చైనాలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ సోషల్ మీడియా వెబ్‌సైట్‌ను చాలా మంది చైనీయులు వినియోగిస్తున్నారు. గాల్వాన్ లోయ ఎఫెక్టు కారణంగా చైనాపై భారత్ సోషల్ మీడియా యుద్ధం ప్రారంభించింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sushant: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం హత్య కాదు.. ఆత్మహత్య.. కేసును క్లోజ్ చేసిన సీబీఐ

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

తర్వాతి కథనం
Show comments