'అవిశ్వాస తీర్మానం' అడ్డుకట్టకు అన్నాడీఎంకే అస్త్రాన్ని ప్రయోగించిన బీజేపీ

తమపై తెలుగుదేశం పార్టీ ప్రయోగించిన అవిశ్వాస తీర్మాన అస్త్రానికి విరుగుడుగా అన్నాడీఎంకే అస్త్రాన్ని అధికార భారతీయ జనతా పార్టీ ప్రయోగించింది. ఆ పార్టీ ద్వారా సభలో రభస చేయించి, సభా కార్యక్రమాలు ఆర్డర్‌లో

Webdunia
సోమవారం, 19 మార్చి 2018 (12:36 IST)
తమపై తెలుగుదేశం పార్టీ ప్రయోగించిన అవిశ్వాస తీర్మాన అస్త్రానికి విరుగుడుగా అన్నాడీఎంకే అస్త్రాన్ని అధికార భారతీయ జనతా పార్టీ ప్రయోగించింది. ఆ పార్టీ ద్వారా సభలో రభస చేయించి, సభా కార్యక్రమాలు ఆర్డర్‌లో లేకుండా చేస్తూ, అవిశ్వాస తీర్మాన నోటీసు చర్చకు రాకుండా అడ్డుకోవాలని కమలనాథులు వేసిన ఎత్తుగడ పూర్తిగా ఫలించింది. ఫలితంగా 37 మంది ఎంపీలు కలిగిన అన్నాడీఎంకే సభ్యులు ఏకమై కావేరీ జల బోర్డును ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేస్తూ స్పీకర్ పోడియంను చుట్టిముట్టి రభస చేశారు. దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ కూడా ఈ రభసను సాకుగా చూపి సభను వాయిదా వేశారు. శుక్రవారం ఇదేవిధంగా వాయిదా వేయగా, సోమవారం కూడా సభను మంగళవారానికి వాయిదావేశారు. దీంతో టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చే ఆస్కారమే లేకుండా పోయేలా కనిపిస్తోంది. 
 
నిజానికి ప్రధాని మోడీ సర్కారుపై తెలుగుదేశం, వైకాపాలు లోక్‌సభలో అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇచ్చారు. ఈ విషయాన్ని స్పీకర్ సుమిత్రా మహాజన్ కూడా సభలో ప్రకటించారు. అయితే, ఆ అవిశ్వాస తీర్మానం సోమవారం కూడా చర్చకు రాలేదు. ఉదయం 11 గంటలకు మొదలైన సభ క్షణాల్లోనే 12 గంటల వరకూ వాయిదా పడగా, ఆపై 12 గంటలకు సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా పలు పార్టీల సభ్యులు నినాదాలతో సభను హోరెత్తించారు. 
 
ప్రశ్నోత్తరాలను చేపట్టాలని స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రయత్నించి విఫలమయ్యారు. సభ ఆర్డర్‌లో లేదంటూ, అవిశ్వాసంపై చర్చించాలని ఉన్నప్పటికీ, కుదిరేలా లేదన్న ఆమె, సభను రేపటి (మంగళవారం)కి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. అంతకుముందే రాజ్యసభ కూడా రేపటికి వాయిదా పడింది. కేంద్రం అవిశ్వాస తీర్మానంపై మొండి వైఖరిని అవలంభిస్తోందని, అందుకే సోమవారం కూడా చర్చ చేపట్టలేదని వైసీపీ, టీడీపీ ఎంపీలు ఆరోపించారు. తాము మరింతగా నిరసనలు తెలియజేస్తామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments