Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుప్రీం ఆదేశాలు ఉల్లంఘన.. 2 గంటలకు పైగా పేల్చినందుకు అరెస్టులు

Webdunia
బుధవారం, 7 నవంబరు 2018 (15:25 IST)
దీపావళి పండుగ సందర్భంగా సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టులు చోటుచేసుకున్నాయి. తమిళనాట మంగళవారమే దీపావళి పండుగ జరిపిన నేపథ్యంలో చెన్నై, కోయంబత్తూరు, తిరుప్పూరు తదితర నగరాల్లో వేకువజామున 5 గంటలకే ప్రజలు టాపాసులు పేల్చడం ప్రారంభించారు. చెన్నై నగరంలో మధ్యాహ్నం కూడా టపాసులు పేల్చారు. రెండు గంటలు మించి టపాసులు పేల్చరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది. 
 
ఆ 2 గంటల సమయం కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెప్పొచ్చని పేర్కొంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉదయం 6 నుంచి 7 గంటల వరకు, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు మాత్రమే టపాసులు పేల్చాలని ఉత్తర్వులు జారీచేసింది. అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా 500లకు పైగా నిఘా బృందాలను రంగంలోకి దింపింది. 
 
అయితే రాష్ట్రంలో పలుచోట్ల వేకువజాము 5 గంటల నుంచి 8 గంటల వరకు టపాసులు పేల్చారు. దీంతో తిరునల్వేలిలో ఏడుగురిపై, చెన్నై, కోయంబత్తూరు, తిరుప్పూరు నగరాలలో 80 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిలో 13 మందిని అరెస్టు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అప్రకటిత సమయంలో టపాసులు పేల్చిన సుమారు 200 మందిపై కేసులు నమోదయ్యాయి. వీరిలో పన్నెండేళ్లలోపు బాలురు కూడా ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments