చితిపై కాలిన మహిళ మృతదేహాన్ని పీక్కుతున్న నరమాంస భక్షకులు

Webdunia
గురువారం, 13 జులై 2023 (22:00 IST)
ఒడిశా రాష్ట్రంలో ఘోరాతిఘోరం జరిగింది. ఇద్దరు నరమాంసం భక్షకులు వెలుగులోకి వచ్చింది. చితిపై కాలిన మహిళ మృతదేహాన్ని ఇద్దరు వ్యక్తులు పీక్కుతినడం తీవ్ర కలకలం రేపింది. రాష్ట్రంలోని మయూర్ భంజ్ జిల్లాలో మధుస్మిత సింగ్ అనే 30 యేళ్ల మహిళ చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందింది. వివిధ కారణాలతో పోలీసులు అనుమానాస్పదంగా మృతిగా కేసు నమోదు చేసుకుని, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
 
శ్మశానంలో ఆమె మృతదేహాన్ని దహనం చేశారు. అయితే, అంత్యక్రియలకు హాజరైన ఆమె బంధువులు సుందర్ మోహ్ సింగ్ (45) నరేంద్ర సింగ్ చితిపై కాలిన మధుస్మిత మృతదేహంలో కొన్ని భాగాలను ఆరగించారు. వారిద్దరూ చితి వద్ద మధుస్మిత శరీర భాగాలను ఆరగిస్తూ గమనించి ఇతర బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
సాక్ష్యాధారాలు ఉండడంతో వారిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని మయూర్ భంజ్ జిల్లా ఎస్పీ బి.గంగాధర్ తెలిపారు. సుందర్ మోహన్ సింగ్, నరేంద్ర సింగ్‌లను అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. వారిద్దరూ గతంలో కూడా ఇలాగే నరమాంసం భక్షణ చేసేవారా? అనే కోణంలో విచారిస్తున్నామని ఎస్పీ పేర్కొన్నారు. వారిద్దరూ సారా తాగిన మైకంలో నరమాంస భక్షణ చేశారని పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మేఘన కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి : రాశీ సింగ్

Balakrishna: ఇదంతా ప్రకృతి శివుని ఆజ్ఞ. అఖండ పాన్ ఇండియా సినిమా : బాలకృష్ణ

ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ.. బాలయ్య కూడా నటిస్తారట.. ఫ్యాన్స్ ఖుషీ

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments