Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీ చైతన్య చీఫ్ బీఎస్ రావుకు అదే ప్రేరణ.. చంద్రబాబు సంతాపం

Webdunia
గురువారం, 13 జులై 2023 (21:44 IST)
BS Rao
శ్రీ చైతన్య విద్యా సంస్థల అధినేత బీఎస్ రావు ఇకలేరు. బాలికల కోసం ప్రత్యేకించి కళాశాలలు కనిపించకపోవడం.. పదో తరగతిలో మంచి ఫలితాలు సాధిస్తున్న విద్యార్థులు ఇంటర్ విద్యకు వచ్చేసరికి సరైన ప్రతిభ కనబరచకపోవడంతోనే తాను శ్రీ చైతన్య విద్యా సంస్థను ఏర్పాటు చేసేందుకు ప్రేరణగా నిలిచిందని ఆ సంస్థల అధినేత, బీఎస్ రావు గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 
 
ఇరాన్ నుంచి భారత్‌కు వచ్చి తన కుమార్తెల విద్య కోసం మంచి స్కూల్ వెతికతే కనబడలేదని.. ఆ క్రమంలోనే బాలికల కోసం.. ఇంటర్ విద్యార్థుల కోసం పోటీ పరీక్షలకు శిక్షణా సంస్థను స్థాపించినట్లు తెలిపారు. అనతికాలంలోనే తమ విద్యా సంస్థల్లోని విద్యార్థులకు ఐఐటీ, నీట్‌లలో మంచి మార్కులు వచ్చాయన్నారు. అలా స్థాపించిన శ్రీచైతన్య తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశంలో పలు రాష్ట్రాలకు చేరిందన్నారు. 
 
ఇకపోతే.. బీఎస్ రావు మృతి పట్ల ప్రముఖ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందిస్తూ.. విద్యా దార్శనికుడు, శ్రీచైతన్య విద్యా సంస్థల వ్యవస్థాపకుడు ఇక లేరని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని చెప్పారు. అత్యంత నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి బీఎస్ రావు ఎంతగానో కృషి చేశారని చంద్రబాబు కొనియాడారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

తర్వాతి కథనం
Show comments