మోడీనే కాదు ఎవర్నీ పిలవొద్దు.. సాదాసీదాగానే ఇమ్రాన్ ప్రమాణం

పాకిస్థాన్ కొత్త ప్రధానమంత్రిగా మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి అతిరథ మహారథులను ఆహ్వానించాలని ఆయన తొలుత భావించారు. కానీ, ఇంతలోనే మనసు మార్చుకున్నా

Webdunia
గురువారం, 2 ఆగస్టు 2018 (15:50 IST)
పాకిస్థాన్ కొత్త ప్రధానమంత్రిగా మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి అతిరథ మహారథులను ఆహ్వానించాలని ఆయన తొలుత భావించారు. కానీ, ఇంతలోనే మనసు మార్చుకున్నారు. ఈ ప్రమాణ స్వీకారం సాదాసీదాగానే ముగించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు ఇతర దేశాల ప్రతినిధులను కూడా  ఆహ్వానించాలని నిర్ణయించినా తాజాగా ఆ ఆలోచన విరమించుకున్నారు.
 
ప్రమాణ స్వీకార కార్యక్రమం అత్యంత ప్రసాదాసీదాగా ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించాలని పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ) నిర్ణయించుకుంది. దీంతో మోడీ సహా ఏ ఇతర విదేశీ ప్రతినిధులు కూడా ఇమ్రాన్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే అవకాశం లేదు. కార్యక్రమం భారీగా నిర్వహిస్తే ఖజానా మీద భారం పడుతుందని భావించడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పీటీఐ పేర్కొంది. 
 
కేవలం ఇమ్రాన్ స్నేహితులు, కొందరు క్రీడాకారులను మాత్రమే ఈ ఈవెంట్‌కు ఆహ్వానిస్తున్నట్టు పీటీఐ ప్రకటించింది. ఐవాన్-ఎ-సదర్ (అధ్యక్ష భవనం)లో అత్యంత సాదాసీదాగా ఇమ్రాన్ నూతన ప్రధాని బాధ్యతలు స్వీకరిస్తారు. భారత్-పాక్ మధ్య సత్సంబంధాలు దృష్టిలో పెట్టుకొని మోడీని, ప్రజల మధ్య సాంస్కృతిక సంబంధాల పటిష్టత దృష్ట్యా బాలీవుడ్ స్టార్ ఆమీర్ ఖాన్‌ను, క్రికెటర్లు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, సిద్దూలను కూడా ఆహ్వానించినట్లు వార్తలొచ్చిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: రవితేజ, డింపుల్ హయతి.. భర్త మహాశయులకు విజ్ఞప్తి నుంచి మెలోడీ సాంగ్

ఎవరు కొత్త తరహా సినిమా చేసినా ప్రోత్సాహించాలి, లేకుంటే ముందడుగు వేయలేరు : కార్తి

మాకు మనవళ్ళు పుట్టినా నాగార్జున అలానే ఉన్నారు.. యాంటీ ఏజింగ్ టెస్టులు చేయాలి...

విదు, ప్రీతి అస్రాని మ‌ధ్య కెమిస్ట్రీ 29 సినిమాకు ప్ర‌ధానాక‌ర్ష‌ణ

మగాళ్లను మొక్కు కుంటూ కాదు తొక్కు కుంటూ పోతం.. పురుష కొత్త పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తర్వాతి కథనం
Show comments