Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్భయ కేసు : క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేసిన ఓ ముద్దాయి

Webdunia
గురువారం, 9 జనవరి 2020 (15:42 IST)
నిర్భయ కేసులో దోషులుగా తేలిన నలుగురు నిందితులకు ఈనెల 22వ తేదీన ఉదయం 7 గంటలకు ఉరిశిక్షలను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఢిల్లీ పాటియాలా కోర్టు జారీ చేసిన డెత్ వారెంట్ల మేరకు ఈ చర్యలు చేపట్టారు. అయితే, ఓ దోషి మాత్రం మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తనకు విధించిన ఉరిశిక్షపై స్టే ఇవ్వాలంటూ క్యురేటివ్ పిటిషన్‌ను దాఖలు చేశాడు. అంటే న్యాయపరంగా తనకున్న చివరి అవకాశాన్ని దోషి వినయ్ కుమార్ శర్మ వినియోగించుకున్నాడు. 
 
గత 2012 డిసెంబరు 16వ తేదీన ఢిల్లీలో ఓ పారామెడికల్ వైద్య విద్యార్థినిపై సామూహిక లైంగిక దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఓ మైనర్ (17) సహా ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు విచారణలో ఉండగానే ప్రధాన నిందితుడైన రామ్‌సింగ్ 2013 మార్చి 11న తీహార్ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. మైనర్ (17)కు జువెనైల్ జస్టిస్ బోర్డు మూడేండ్ల శిక్ష విధించి బాలనేరస్థుల పాఠశాలకు తరలించింది. అతడు 2015 డిసెంబర్ 20న విడుదలయ్యాడు. 
 
ఈ కేసులో మిగిలిన నలుగురు ముద్దాయిలైన ముఖేశ్‌(32), పవన్‌ గుప్తా(25), వినయ్‌ శర్మ(26), అక్షయ్‌ కుమార్‌ సింగ్‌(అక్షయ్‌ ఠాకూర్‌)(31)పై అదనపు సెషన్స్‌ జడ్జి సతీశ్‌ కుమార్‌ అరోరా డెత్ వారెంట్ జారీచేశారు. దీంతో వినయ్ శర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీంతో నిర్భయ కేసులోని దోషులకు ఈనెల 22వ తేదీన ఉరిశిక్షలు అమలవుతాయా లేదా అన్న సందేహం నెలకొంది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం