Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్.ఐ.ఏ చేతికి పుల్వామా ఉగ్రదాడి కేసు

Webdunia
గురువారం, 21 ఫిబ్రవరి 2019 (14:05 IST)
పుల్వామా ఉగ్రదాడి కేసును కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు అప్పగించింది. కేంద్రం ఆదేశాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. సంఘటన జరిగిన ప్రదేశం నుండి ఇప్పటికే ఆధారాలు సేకరించి మరింత లోతుగా విచారణ జరుపుతున్న ఎన్ఐఏకు అనేక సంచలన వాస్తవాలు తెలుస్తున్నాయి.
 
దాడిలో పేలుడు జరిగేందుకు ఉపయోగించిన ఆర్డీఎక్స్‌ను చిన్న పిల్లలు, మహిళల ద్వారానే ఒక చోటి నుండి మరో చోటికి తరలించినట్లు ఎన్ఐఏ నిర్ధారణకు వచ్చింది. ఈ తరలింపు ప్రక్రియను దాదాపు కొన్ని నెలలపాటు చేసినట్లు నిర్ధారించారు. కాగా ఆత్మాహుతి దాడిలో ఉపయోగించిన పరికరాలను మాత్రం స్థానికంగానే తయారు చేసినట్లు తెలుస్తోంది.
 
పేలుడులో ఉపయోగించిన ఆర్డీఎక్స్ 99.5 శాతం నాణ్యత కలిగి చాలా ఖరీదైనదని పేర్కొంది. ఈ ఆర్డీఎక్స్‌ను రావల్పిండిలోని పాకిస్థాన్ ఆర్మీ నుండి కొనుగోలు చేసి, ఆపై దాన్ని ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌కు అందజేసినట్లు తెలుసుకున్నారు. 2018 నుండే పుల్వామాలోని ట్రాల్ గ్రామానికి బ్యాగులు, సిలిండర్లు, కోల్ బ్యాగ్స్ ద్వారా తరలించినట్లు ఆధారాలు సేకరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments