Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉగ్రవాదులుగా భావించి భద్రతా బలగాల కాల్పులు - 14 మంది పౌరులు మృతి

Webdunia
ఆదివారం, 5 డిశెంబరు 2021 (10:48 IST)
ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన నాగాలాండ్‌లో దారుణం జరిగింది. భారత భద్రతా బలగాలు పెద్ద తప్పు చేశారు. సాధారణ పౌరులను ఉగ్రవాదులుగా భావించారు. దీంతో వారిని లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడ్డాయి. ఈ కాల్పుల్లో 14 మంది మృత్యువాతపడ్డారు. ఫలితంగా నాగాలాండ్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. ఈ దారుణం మోన్ జిల్లాలోని తిరు గ్రామంలో జరిగింది. 
 
అంతకుముందు భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో సాధారణ పౌరులను భద్రతా బలగాలు ఉగ్రవాదులుగా భావించి, ఈ కాల్పులు జరిపారు. మోన్ జిల్లా తిరు గ్రామంలోని ఓటింగ్ వద్ద ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో పలువురు జవాన్లు మృతిచెందారు. 
 
దీంతో భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం వేట చేపట్టింది. ఆ సమయంలో అటుగా వస్తున్న తిరు గ్రామానికి చెందిన కూలీలపై భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. దీంతో 14 మంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన శనివారం రాత్రి జరుగగా, తాజాగా వెలుగులోకి వచ్చింది.
 
ఈ ఘటన తర్వాత భద్రతా బలగాలపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హింసకు పాల్పడ్డారు. ఎన్ఎస్సీఎన్ మిలిటెంట్లుగా పొరపాటున అమాయక పౌరులను పొట్టన పెట్టుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేంద్ర హోం శాఖ ఆరా తీస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం