Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉగ్రవాదులుగా భావించి భద్రతా బలగాల కాల్పులు - 14 మంది పౌరులు మృతి

Webdunia
ఆదివారం, 5 డిశెంబరు 2021 (10:48 IST)
ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన నాగాలాండ్‌లో దారుణం జరిగింది. భారత భద్రతా బలగాలు పెద్ద తప్పు చేశారు. సాధారణ పౌరులను ఉగ్రవాదులుగా భావించారు. దీంతో వారిని లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడ్డాయి. ఈ కాల్పుల్లో 14 మంది మృత్యువాతపడ్డారు. ఫలితంగా నాగాలాండ్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. ఈ దారుణం మోన్ జిల్లాలోని తిరు గ్రామంలో జరిగింది. 
 
అంతకుముందు భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో సాధారణ పౌరులను భద్రతా బలగాలు ఉగ్రవాదులుగా భావించి, ఈ కాల్పులు జరిపారు. మోన్ జిల్లా తిరు గ్రామంలోని ఓటింగ్ వద్ద ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో పలువురు జవాన్లు మృతిచెందారు. 
 
దీంతో భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం వేట చేపట్టింది. ఆ సమయంలో అటుగా వస్తున్న తిరు గ్రామానికి చెందిన కూలీలపై భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. దీంతో 14 మంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన శనివారం రాత్రి జరుగగా, తాజాగా వెలుగులోకి వచ్చింది.
 
ఈ ఘటన తర్వాత భద్రతా బలగాలపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హింసకు పాల్పడ్డారు. ఎన్ఎస్సీఎన్ మిలిటెంట్లుగా పొరపాటున అమాయక పౌరులను పొట్టన పెట్టుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేంద్ర హోం శాఖ ఆరా తీస్తుంది. 

సంబంధిత వార్తలు

కల్కి 2898 AD నుంచి ప్రభాస్, దిల్జిత్ దోసాంజ్ 'భైరవ అంథమ్' రిలీజ్

షో రీల్ తో ఆకట్టుకున్న మిస్టర్ బచ్చన్

అంజలి బహిష్కరణ చేసింది ఎవరిని?

సినిమా రంగంలో సవాళ్లు నేపథ్యంగా ఇట్లు... మీ సినిమా

అనుపమ పరమేశ్వరన్ నటిసున్న పరదా లో దర్శన రాజేంద్రన్ పరిచయం

అసిడిటీ తగ్గించుకోవడానికి అద్భుతమైన చిట్కాలు

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

తర్వాతి కథనం