Webdunia - Bharat's app for daily news and videos

Install App

'తమ్ముడు'కే 'అన్నయ్య' మద్దతు - తేల్చి చెప్పిన మెగాస్టార్

Webdunia
మంగళవారం, 28 ఏప్రియల్ 2020 (14:11 IST)
మెగాస్టార్ చిరంజీవిపై ఇంతకాలం సాగుతూ వచ్చిన ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెట్టారు. తాను పార్టీ మారబోవడం లేదని తేల్చి చెప్పారు. పైగా, తన మద్దతు ఎల్లపుడూ తన సోదరుడు పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేనకే ఉంటుదని క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనపై సాగుతున్న ప్రచారానికి తెరదించారు. 
 
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డితో విజయవాడ, తాడేపల్లిలో ఉన్న సీఎం క్యాంపు కార్యాలయంలో చిరంజీవి భేటీ అయ్యారు. ఆ సమయంలో చిరంజీవి వెంట ఆయన సతీమణి కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్‌తో ఏకాంత చర్చల అనంతరం సీఎం దంపతులతో కలిసి చిరంజీవి దంపతులు విందు ఆరగించారు. ఆ తర్వాత ఆయన హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. 
 
అప్పటి నుంచి చిరంజీవి వైకాపాలో చేరబోతున్నట్టు ప్రచారం సాగుతూ వచ్చింది. దీనిపై చిరంజీవి ఎక్కడా కూడా క్లారిటీ ఇవ్వలేదు. కానీ, తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి ఇదే అంశంపై స్పందించారు. తన మద్దతు ఎప్పటికీ జనసేనకే ఉంటుందని తేల్చి చెప్పారు. తనకు తన సోదరుడు పవన్ కళ్యాణ్, అతని పట్టుదల గురించి బాగా తెలుసని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 
 
అంతేకాకుండా, పవన్ కళ్యాణ్‌కు రాజకీయ సలహాలు అవసరంలేదన్నారు. పైగా, సొంతగా పార్టీని నడిపే శక్తి సామర్థ్యాలు కళ్యాణ్‌కు ఉన్నాయన్నారు. అందువల్ల తన సంపూర్ణ మద్దతు ఎల్లవేళలా జనసేన పార్టీకే ఉంటుదని చిరంజీవి తేల్చి చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments