Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయాల నుంచి తప్పుకుంటానంటున్న కేంద్ర మంత్రి

Webdunia
ఆదివారం, 17 నవంబరు 2019 (12:13 IST)
గిరిరాజ్ సింగ్. ఈయన ఓ కేంద్ర మంత్రి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంత్రివర్గంలో సీనియర్ మంత్రిగా ఉన్నారు. ఈయన తాజాగా ఓ సంచలన విషయాన్ని వెల్లడించారు. తాను అనుకున్న లక్ష్యాల్లో ఒకటి నెరవేరిందన్నారు. రెండోది నెరవేరే సమయం ఆసన్నమైందన్నారు. ఆ రెండు లక్ష్యాల్లో ఒకటి రామమందిర నిర్మాణమన్నారు. రెండోది తాను క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకోవడమన్నారు. 
 
ఇద అంశంపై ఆయన బీహార్‌లో మీడియాతో మాట్లాడుతూ, అయోధ్యలో శ్రీరామునిది దేవాలయం, జనాభా నియంత్రణ తన కెరీర్‌లో రెండు ప్రధాన లక్ష్యాలన్నారు. రామాలయం నిర్మించే సమయం వచ్చేసిందని, ఇది తనవంటి వృద్ధులు రాజకీయాలకు స్వస్తి చెప్పాల్సిన సమయమని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
ఇకపోతే, జనాభా నియంత్రణ చట్టం త్వరలోనే అమలులోకి వస్తుందని భావిస్తున్నానని, ఆపై రాజకీయాల నుంచి రిటైర్ మెంట్ తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. కాగా, గతంలో పలుమార్లు జనాభా నియంత్రణపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ముస్లింల కారణంగానే దేశంలో జనాభా పెరుగుతోందని, ఆ అంశమే తనను రాజకీయాలవైపు మళ్లించిందని ఆయన అంటుండేవారు. 

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments