Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడక్ నాథ్ కోళ్లను అమ్మేందుకు రెడీ అంటోన్న ధోనీ

Webdunia
ఆదివారం, 10 జులై 2022 (00:13 IST)
రాంచీలో ఫాంహౌస్ నెలకొల్పి కడక్ నాథ్ కోళ్లను పెంచుతున్నాడు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. కడక్ నాథ్ కోడి పోషకాలతో కూడుకున్నది. పైగా ధర కూడా ఎక్కువే. కిలో కోడికి రూ. 800 నుంచి వెయ్యి వరకు ధర కూడా పలుకుతోంది. దీని మాంసం కూడా వెరైటీగా ఉంటుంది. కలర్ నల్లగా ఉంటుంది. దీంతో వీటి మాంసానికి విలువ ఎక్కువ. 
 
ధోని తన ఫాంహౌస్‌కు వచ్చి తీసుకెళ్లే వారికే కోళ్లు అమ్మేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. కడక్ నాథ్ కోళ్లంటే ఎక్కడా దొరకవు. అవి మధ్యప్రదేశ్‌లో మాత్రమే దొరుతుతాయి. 
 
గత ఏప్రిల్‌లో మధ్యప్రదేశ్ నుంచి కడక్ నాథ్ కోడిపిల్లలను సుమారు రెండువేలు తీసుకొచ్చి ఫాం హౌస్‌లో వేశాడు. ఇప్పుడు అవి 800 గ్రాముల నుంచి కిలో వరకు పెరిగాయి. దీంతో వాటిని విక్రయించాలని ధోని భావిస్తున్నాడు. కేజీ ధర రూ. 800 నుంచి వెయ్యి వరకు అమ్మాలనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
 
కానీ మార్కెట్ కు తరలించి అడ్డగోలు ధరలకు కాకుండా సరసమైన ధరలకు ప్రజలకు నేరుగా అందించేందుకు ఏర్పాట్లు చేశాడు. దీంతో వాటిని నేరుగా ప్రజలకు అందించేందుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
 
మరోవైపు ధోని తన ఫాంహౌస్ లో ఈసారి కూరగాయలు కూడా పెంచుతున్నాడు. టమోటాలతో పాటు వంకాయలు ఇతర కూరగాయలను సేంద్రియ ఎరువులతోనే పండిస్తూ ప్రజలకు ఆరోగ్యం కలిగించేందుకు సిద్ధమయ్యాడు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments