Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోలీ పండుగ.. ఆ ఊళ్లో మాత్రం పిడికిళ్లతో కొట్టుకుంటారు...

Webdunia
గురువారం, 21 మార్చి 2019 (11:24 IST)
హోలీ పండుగ రంగుల పండుగ, అందరూ రంగులు పూసుకుంటారు లేదా చల్లుతారు. ఇష్టంలేని వారు గమ్మున ఇంట్లో కూర్చుంటారు. కానీ ఓ ఊళ్లో మాత్రం మగవాళ్లంతా గాయాలయ్యేలా పిడికిళ్లతో కొట్టుకుంటారు. దానికి పేరు కూడా పిడిగుద్దులాట అని పెట్టారు. కొట్టుకుంటే రక్తాలు వస్తాయి అని తెలిసి కూడా ఆటను కొనసాగిస్తారు. తమకు ఏమీ కానట్లు మిన్నుకుండిపోతారు. 
 
హోలీ రోజు రంగుపడుద్ది అంటూ వినూత్న ఆచారాన్ని పాటించే ఈ గ్రామం నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మండలంలోని హున్స. గురువారమే హోలీ కదా, గ్రామ పురుషులంతా ముష్టిఘాతాలకు సిద్ధమవుతున్నారు. పిడిగుద్దులాట చేయకపోతే గ్రామానికి అరిష్టం అని నమ్ముతారు. దానికి నిదర్శనంగా గతంలో పిడిగుద్దులాట జరపకపోవడం వల్ల నీళ్ల ట్యాంక్ కూలిపోయిందని చెబుతారు. 
 
హోలీ రోజు సాయంత్రం గ్రామంలోని ప్రధాన కూడలిలో పురుషులు పిడికిళ్లను బిగించి ఒకరిపై ఒకరు అరగంట పాటు దాడి చేసుకుంటారు. తర్వాత పరస్పరం అలయ్‌బలయ్‌ చేసుకుంటారు. పిడిగుద్దులతో గాయపడిన వారు కామ దహన బుడిదను దెబ్బలకు రాసుకుంటారు. ఇలా చేస్తే ఎలాంటి గాయమైనా మానిపోతుందని వారి విశ్వాసం. కాగా గ్రామస్థుల సమ్మతితోనే ప్రతి ఏటా ఈ క్రీడను నిర్వహిస్తున్నామని మాజీ సర్పంచ్‌ వరాజ్‌ పటేల్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments