Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ పప్పుకు అర్థమయ్యేలా చేస్తాం: రోజా సంచలన వ్యాఖ్యలు

Webdunia
సోమవారం, 16 ఆగస్టు 2021 (21:43 IST)
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు నగరి ఎమ్మెల్యే రోజా. ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందో సరిగ్గా చెప్పలేని పప్పు నారా లోకేష్‌కు సీఎంను విమర్శించే అర్హత లేదన్నారు. అసలు ఏం మాట్లాడతాడో అతనికే తెలియదంటూ లోకేష్ పైన మండిపడ్డారు రోజా.
 
చిత్తూరు జిల్లా నగరిలో ప్రభుత్వ పాఠశాలల పునఃప్రారంభమైన సందర్భంగా రోజా ఈ వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో ఏ పాఠశాలకు వెళ్లి విద్యార్థులను అడిగినా వారు టక్కున సమాధానం చెబుతారని రోజా చెప్పుకొచ్చారు.
 
లోకేష్‌కు అన్ని అర్థమయ్యే విధంగా త్వరలోనే చేస్తామన్నారు. ఎన్నో పథకాలు అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అత్యద్భుతమైన పాలనను అందిస్తున్నారని రోజా చెప్పారు. 
 
ప్రతిపక్ష నేతలకు ఏదో ఒక సాకు చూపించి ప్రజల దృష్టిలో పడాలన్న ఉద్దేశంతో పనికిమాలిన విమర్శలు చేస్తున్నారని రోజా మండిపడ్డారు. జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రతిపక్ష నేతలకు ఏ సమయంలోనైనా చూపించడానికి సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

Sundeep Kishan: శివ మల్లాల నిర్మాణంలో సందీప్‌కిషన్‌ క్లాప్‌తో ప్రారంభమైన హ్రీం

బాణామతి బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న చిత్రం చేతబడి

Samantha: సమంత, రాజ్ కలిసి డిన్నర్ చేశారా? కారులో జతగా కనిపించారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

తర్వాతి కథనం
Show comments