Webdunia - Bharat's app for daily news and videos

Install App

17న గుండెంగి గ్రామంలో వైఎస్. షర్మిళ ఉద్యోగ దీక్ష

Webdunia
సోమవారం, 16 ఆగస్టు 2021 (19:55 IST)
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్. షర్మిల ప్రతి మంగళవారం ఒక రోజు నిరుద్యోగులకు మద్దతుగా దీక్ష చేస్తున్నారు. ఇందులోభాగంగా, ఇప్పటికే పలు గ్రామాల్లో ఆమె దీక్ష చేశారు. ఈ దీక్షలో భాగంగా, ఉద్యోగం రాక ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగ కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించి, ఓదార్చుతున్నారు. 
 
ఇదిలావుంటే, మంగళవారం నుంచి మూడు రోజుల పాటు మహబూబాబాద్ జిల్లాలో ఆమె పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా, మహబూబాబాద్ జిల్లాలోని గుండెంగి గ్రామంలో ఉద్యోగ దీక్ష చేయనున్నారు. అనంతరం మంగళవారం రాత్రి వరంగల్ పట్టణంలోనే షర్మిల బస చేస్తారు. ఉద్యోగ దీక్షతో పాటు పోడు భూముల పోరుకు వైఎస్ షర్మిల శ్రీకారం చుట్టనున్నారు.
 
మరోవైపు ఎల్లుండి (బుధవారం) ములుగు జిల్లా లింగాల గ్రామంలో షర్మిల పోడు యాత్ర నిర్వహించనున్నారు. ఈ మూడు రోజుల పర్యటన అనంతరం వైఎస్ షర్మిల.. తిరిగి హైదరాబాద్ రానున్నారు. కాగా ప్రతి మంగళవారం ఉద్యోగ దీక్ష చేపడుతున్న వైఎస్ షర్మిల గత మంగళ వారం హుజూరాబాద్ నియోజక వర్గంలో ఉద్యోగ దీక్ష చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments