Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ పప్పుకు అర్థమయ్యేలా చేస్తాం: రోజా సంచలన వ్యాఖ్యలు

Webdunia
సోమవారం, 16 ఆగస్టు 2021 (21:43 IST)
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు నగరి ఎమ్మెల్యే రోజా. ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందో సరిగ్గా చెప్పలేని పప్పు నారా లోకేష్‌కు సీఎంను విమర్శించే అర్హత లేదన్నారు. అసలు ఏం మాట్లాడతాడో అతనికే తెలియదంటూ లోకేష్ పైన మండిపడ్డారు రోజా.
 
చిత్తూరు జిల్లా నగరిలో ప్రభుత్వ పాఠశాలల పునఃప్రారంభమైన సందర్భంగా రోజా ఈ వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో ఏ పాఠశాలకు వెళ్లి విద్యార్థులను అడిగినా వారు టక్కున సమాధానం చెబుతారని రోజా చెప్పుకొచ్చారు.
 
లోకేష్‌కు అన్ని అర్థమయ్యే విధంగా త్వరలోనే చేస్తామన్నారు. ఎన్నో పథకాలు అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అత్యద్భుతమైన పాలనను అందిస్తున్నారని రోజా చెప్పారు. 
 
ప్రతిపక్ష నేతలకు ఏదో ఒక సాకు చూపించి ప్రజల దృష్టిలో పడాలన్న ఉద్దేశంతో పనికిమాలిన విమర్శలు చేస్తున్నారని రోజా మండిపడ్డారు. జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రతిపక్ష నేతలకు ఏ సమయంలోనైనా చూపించడానికి సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments