Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీమాంధ్రలో పోటీ చేయనంటున్న 'ఆంధ్రా ఆక్టోపస్'

Webdunia
గురువారం, 1 నవంబరు 2018 (11:27 IST)
ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరుగడించిన వ్యక్తి లగడపాటి రాజగోపాల్. ఈ మాజీ లోక్‌సభ సభ్యుడు రాష్ట్ర విభజన అనంతరం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే, ఈ మధ్యకాలంలో అడపాదడపా మీడియా ముందుకు వస్తూ పలు అంశాలపై స్పందిస్తున్నారు. ముఖ్యంగా.. ఎన్నికల ఫలితాలపై ఆయన వెల్లడిస్తున్న విషయాలు అక్షరసత్యాలవుతున్నాయి. దీంతో లగడపాటి సర్వేను ప్రతి ఒక్కరూ గట్టిగా నమ్ముతారు. 
 
ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీలో ఏపీ భవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ, 'ప్రజల కోరిక మేరకు రాజకీయాల్లోకి రావడంపై నిర్ణయం తీసుకుంటా. ఈ మధ్య తెలంగాణలోని మెదక్‌ జిల్లాకు వెళ్తే అక్కడి ప్రజలు, పోలీసులు చుట్టుముట్టి తెలంగాణలో పోటీ చేయకూడదా అని అడిగారు. అవకాశమొస్తే తెలంగాణలో తప్పకుండా పోటీ చేస్తా. ఆంధ్రాలో భావోద్వేగాలను అడ్డుపెట్టుకొని రాజకీయంగా ఎదగకూడదని అనుకున్నా కాబట్టి తెలంగాణలో చాన్స్‌ వస్తే పోటీ చేస్తానని చెప్పా. పార్లమెంటుకే తప్ప అసెంబ్లీకి పోటీ చేసే ఆలోచన లేదు. అది కూడా ఇప్పుడు కాదు. ఇదే విషయాన్ని అక్కడి ప్రజలకు చెప్పా' అని ఆయన వివరించారు. 
 
'రాజకీయాల్లో పరిస్థితులను బట్టి అనేకమంది కలుస్తారు. ప్రస్తుతం ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు ప్రత్యర్థులు కావు. అందుకు కలిశాయేమో' తెలంగాణా రాష్ట్రంలో టీడీపీ - కాంగ్రెస్ పార్టీల పొత్తుపై స్పందించారు. మహాకూటమి గెలుస్తుందా అన్న ప్రశ్నకు.. అది తెలంగాణ ప్రజలే చెప్పాలన్నారు. తన సమాధానం డిసెంబరు 7వ తేదీన వెల్లడిస్తానని తెలిపారు. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments