Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్టోబర్‌ నెలలో భారతీయులు ఎక్కువగా దేని గురించి మాట్లాడుకున్నారో తెలుసా?

Webdunia
గురువారం, 1 నవంబరు 2018 (11:08 IST)
అక్టోబర్‌ నెలలో భారతీయులు అధికంగా చర్చించుకున్న అంశం ఏంటో తెలుసా.. మీటూనేనట. బాలీవుడ్ నటుడు నానా పటేకర్‌పై నటి తనుశ్రీ దత్తా చేసిన లైంగిక ఆరోపణలతో దేశంలో ఉద్యమం ఊపందుకుంది. ఆపై దేశ వ్యాప్తంగా మీ టూ గురించి పెద్ద ఎత్తున చర్చ సాగింది. 
 
హాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు దిగుమతి అయిన మీ టూ ఉద్యమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో గత నెలలో భారతీయులు ఎక్కువగా చర్చించుకున్న అంశం మీటూనేనని గ్లోబల్ మీడియా ఇంటెలిజెన్స్ సంస్థ మెల్ట్‌వేర్ పేర్కొంది.
 
ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా చర్చకు వచ్చిన అంశాల్లో 25 శాతం మీటూ గురించేనని తెలిపింది. అమెరికాలో 22 శాతం మంది ఈ విషయం గురించి మాట్లాడుకున్నారు. మీటూ గురించి తొలుత హాలీవుడ్‌లో చర్చకు వచ్చింది. మీటూ ఆరోపణలపై కేంద్రమంతి ఒకరు తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
 
కాగా మీ టూ గురించి అక్టోబర్ 1 నుంచి 30వ తేదీ వరకు డేటాను విశ్లేషించగా.. ఈ విషయం బయటపడినట్లు మెల్ట్‌వేర్ తెలిపింది. మీటూపై అక్టోబరులో మొత్తంగా 28,900 ఎడిటోరియల్ న్యూస్ వచ్చింది. ఇందులో 95 శాతం అక్టోబరు 10 నుంచి 18 మధ్య రావడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

ఎన్టీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను : కె.రాఘవేంద్ర రావు

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం