Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రాలో కేసీఆర్... బాబుకు బర్త్‌డే గిఫ్టు ఇప్పటి నుంచే సిద్ధం చేస్తున్నారా...?

Webdunia
ఆదివారం, 23 డిశెంబరు 2018 (14:31 IST)
తెరాస అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విశాఖ పర్యటనకు వచ్చారు. విశాఖపట్టణంలోని శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి ఆశీస్సులు తీసుకున్నారు. శారదాపీఠంలోని రాజశ్యామల ఆలయంలో కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. 
 
శారదాపీఠం ఆవరణలో ఉన్న శమీ వృక్షానికి, విజయ హనుమాన్‌కు కేసీఆర్ దంపతులు పూజలు చేశారు. అంతకుముందు కుటుంబసభ్యులతో కలిసి శారదాపీఠానికి వచ్చిన సీఎం కేసీఆర్‌కు పీఠం ప్రతినిధులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆశ్రమంలోనే మధ్యాహ్నం భోజనం చేస్తారు. 
 
సాయంత్రం 4.30 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖ నుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్ వెళ్తారు. సాయంత్రం 6 గంటలకు భువనేశ్వర్‌లో ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్‌తో కేసీఆర్ సమావేశమవుతారు. సీఎం కేసీఆర్‌ వెంట టీఆర్‌ఎస్‌ ఎంపీ సంతోష్ కుమార్‌, రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్ర‌శాంత్ రెడ్డి త‌దిత‌రులు ఉన్నారు. 
 
అంత‌కుముందు విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో సీఎం కేసీఆర్‌కు అభిమానులు ఘనస్వాగతం పలికారు. కేసీఆర్‌ను చూసేందుకు ప్ర‌జ‌లు భారీ సంఖ్య‌లో త‌ర‌లిరావ‌డంతో విశాఖ‌లో పండ‌గ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఎయిర్‌పోర్ట్‌లో బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత జ‌నాల‌కు కేసీఆర్ అభివాదం చేశారు. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో జైకేసీఆర్ అంటూ అభిమానులు నినాదాలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments