బెంగుళూరులో కేసీఆర్... వెంట ప్రకాష్ రాజ్.. తెరాసలో చేరినట్టేనా?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బెంగుళూరుకు వెళ్లారు. ఆయన హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు ప్రత్యేక విమానంలో వెళ్లారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతున్న తరుణంలో కేసీఆర్ బెంగుళూరు పర్

Webdunia
శుక్రవారం, 13 ఏప్రియల్ 2018 (13:07 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బెంగుళూరుకు వెళ్లారు. ఆయన హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు ప్రత్యేక విమానంలో వెళ్లారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతున్న తరుణంలో కేసీఆర్ బెంగుళూరు పర్యటన ఆసక్తిని రేపుతోంది.
 
ముఖ్యంగా, దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు లక్ష్యంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇందుకోసం ఆయన నడుంబిగించారు. ఇందులోభాగంగా, బెంగుళూరుకు శుక్రవారం వెళ్ళి, మాజీ ప్రధానమంత్రి, జనతాదళ్ (ఎస్) అధినేత దేవెగౌడతో భేటీ అయ్యారు. 
 
ఈ భేటీ బెంగళూరులోని దేవెగౌడ నివాసం అమోఘలో జరుగింది. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు, లక్ష్యాలు, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై ఇద్దరు నేతలు చర్చించినట్టు సమాచారం. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు లక్ష్యంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుచేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన ఫ్రంట్‌పై ఆసక్తిగా ఉన్న పార్టీల అధినేతలతో సమావేశమవుతున్నారు. 
 
మరోవైపు, బెంగుళూరుకు వెళ్లిన కేసీఆర్ వెంట పార్టీ నేతలు లేకపోగా, సినీ నటుడు ప్రకాష్ రాజ్ మాత్రమే ఉన్నారు. దీంతో ఆయన తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెరాస పార్టీలో చేరినట్టేననే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రకాష్ రాజ్ ఇప్పటికే తెలంగాణాలో ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్న విషయం తెల్సిందే. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments