Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దేవుడా... గుడిలోనే 8 యేళ్ల బాలికపై 7 రోజులు లైంగికదాడి...

దేశంలో మహిళలే కాదు.. ఏమీ తెలియని బాలికల మానప్రాణాలకు కూడా రక్షణ కరవైంది. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో 8యేళ్ల బాలికను ఏడు రోజులు పాటు ఓ ఆలయంలో బంధించి పాశవికంగా లైంగికదాడి చేశారు. ఈ దారుణం ఆలస్యంగా వెలుగు

దేవుడా... గుడిలోనే 8 యేళ్ల బాలికపై 7 రోజులు లైంగికదాడి...
, శుక్రవారం, 13 ఏప్రియల్ 2018 (12:24 IST)
దేశంలో మహిళలే కాదు.. ఏమీ తెలియని బాలికల మానప్రాణాలకు కూడా రక్షణ కరవైంది. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో 8యేళ్ల బాలికను ఏడు రోజులు పాటు ఓ ఆలయంలో బంధించి పాశవికంగా లైంగికదాడి చేశారు. ఈ దారుణం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే....
 
కతువాలో మైనారిటీలుగా ఉన్న బఖర్‌వాల్ సంచారజాతివారిని వెళ్లగొట్టేందుకు కొందరు అక్కడి ఆలయ సంరక్షుడి ఆధ్వర్యంలో ఆసిఫా బానో (8)ను అపహరించి ఓ గ్రామంలో వారం రోజులపాటు నిర్బంధించి, మత్తుమందు ఇచ్చి పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డారు. 
 
చివరికి ఆ బాలికను గొంతు పిసికి చంపి, ప్రాణం పోయిందని నిర్ధారించుకోవడానికి పెద్ద బండరాయితో రెండుసార్లు బాదారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిచడంతో దర్యాప్తు బృందం సిట్ 8 మంది నిందితులను అరెస్టు చేసింది. అరెస్టు అయిన వారిలో ఇద్దరు పోలీసు అధికారులు, ఒక హెడ్‌కానిస్టేబుల్ ఉండటం గమనార్హం. 
 
సాక్ష్యాలను నాశనం చేయడంతో పోలీసులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు కతువాలో ఎనిమిదేండ్ల చిన్నారిపై జరిగిన సామూహిక లైంగికదాడితో మనం మనుష్యులుగా విఫలమయ్యాయని విదేశీ వ్యవహారాలశాఖ సహాయ మంత్రి వీకే సింగ్ ట్వీట్ చేశారు. 
 
దీనిపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది నమ్మశక్యం కానటువంటి క్రూరత్వం, దుండగులు అత్యంత క్రూరంగా ప్రవర్తించారు. అటువంటి వారిని కాపాడటానికి ప్రయత్నాలు జరుగడం విస్మయం కలిగిస్తుంది. దుండగులను శిక్షించకుండా వదిలిపెట్టవద్దు అని ట్వీట్ చేశారు. చిన్నారిపై దాడి మానవత్వంపై దాడి వంటిదని ఆయన తన ట్వీట్‌‌లో పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విచ్చలవిడి శృంగారం కోసం మద్యంలో దగ్గుమందు కలిపి సేవించిన మహిళ...