Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారిని ఉరితీయండి లేదా మమ్మలను కాల్చి చంపండి : రేప్ బాలిక తల్లి

తన 8 యేళ్ల బాలికను నిర్బంధించి అత్యాచారం చేసి అత్యంత పాశవికంగా చంపేసిన నిందితులను ఉరితీస్తారా లేదా మమ్మలను కాల్చి చంపండంటూ ఆ బాలిక తల్లి ప్రాధేయపడుతోంది.

Webdunia
ఆదివారం, 6 మే 2018 (15:11 IST)
తన 8 యేళ్ల బాలికను నిర్బంధించి అత్యాచారం చేసి అత్యంత పాశవికంగా చంపేసిన నిందితులను ఉరితీస్తారా లేదా మమ్మలను కాల్చి చంపండంటూ ఆ బాలిక తల్లి ప్రాధేయపడుతోంది. ఇటీవల జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని కథువా గ్రామంలో కొందరు కామాంధులు 8 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన ఎంత సంచలనం రేపిందో తెలిసిందే.
 
ఈ ఘటనపై ఆ బాలిక తల్లి తాజాగా మీడియాతో మాట్లాడుతూ, నిందితులనైనా ఉరి తీయండి.. లేదంటే మమ్మల్ని కాల్చి చంపండి అని ఆమె ఆవేదన వ్యక్తంచేసింది. వాళ్లను వదిలేస్తే మమ్మల్ని ఎలాగూ చంపుతారు. నాలుగు గ్రామాల ప్రజలు ఇప్పుడు మా వెంట పడుతున్నారు. మేం కేవలం నలుగురం ఉన్నాం. అన్నీ కోల్పోయాం. మా ఇల్లు, ఆస్తి పోయింది అని ఆమె చెప్పింది.
 
అంతేకాకుండా, సీబీఐ విచారణకు అంగీకరించాలని స్థానిక నేతలు తమపై ఒత్తిడి తెస్తునారని బాలిక తల్లి వెల్లడించింది. అయితే బాలిక కుటుంబం మాత్రం రాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులే విచారణ జరపాలని డిమాండ్ చేస్తోంది. నిందితులను కాపాడటం కోసమే స్థానిక నేతలు సీబీఐ విచారణ కోసం పట్టుబడుతున్నారని బాలిక తల్లి ఆరోపించింది. 
 
మేము ఫిర్యాదు ఇచ్చిన సమయంలోనే పోలీసులు చర్యలు తీసుకొని ఉంటే మా బిడ్డ బతికేది. కానీ వాళ్లు ఏడు రోజుల పాటు ఏమీ చేయకుండా ఖాళీగా చేతులు ముడుచుకుని కూర్చున్నారు అని ఆమె విమర్శించింది. 
 
మరోవైపు,  ఈ కేసును కథువా నుంచి మరోచోటికి బదిలీ చేయాలంటూ బాలిక తండ్రి ఇప్పటికే  సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెల్సిందే. మరో రెండు రోజుల్లో దీనిపై కోర్టు తీర్పు వెలువరించనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments