నేడు అంతర్జాతీయ శాంతి దినోత్సవం.. కానీ, ప్రపంచమంతటా అశాంతి!

Webdunia
శనివారం, 21 సెప్టెంబరు 2019 (09:37 IST)
ప్రతి యేటాది సెప్టెంబరు 21వ తేదీని అంతర్జాతీయ శాంతి దినోత్సవంగా జరుపుతుంటారు. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం చేసిన తీర్మానం మేరకు 1982 సెప్టెంబరు 21వ తేదీ నుంచి ఈ శాంతి దినోత్సవాన్ని జరుపుతూ వస్తున్నారు. అంతర్జాతీయంగా కాల్పుల విరమణ, అహింస, శాంతి, సోదరభావాల సాధన కోసం ఈ దినోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. 
 
ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి అల్లర్లు, ఘర్షణలు లేకుండా శాంతియుత జీవనానికే ప్రజానీకం మొగ్గుచూపుతోంది. శాంతి దినోత్సవం రోజున కపోతాలు (తెల్లని పావురాలు) ఎగురవేసి శాంతిపట్ల తమకున్న విశ్వాసాన్ని తెలియజేస్తుంటారు అనేక దేశాధినేతలు. వ్యక్తులు, సంస్థలు, దేశాలు ప్రపంచ శాంతికోసం తమ వంతు ప్రయత్నాలు, ఆచరణీయ కార్యక్రమాలు చేపట్టడానికి అంతర్జాతీయ శాంతి దినోత్సవం పాటిస్తారు. 
 
ప్రపంచంలో ఉన్న అన్ని ఖండాల నుంచి చిన్నారులు పంపిన నాణాలను కలిపి విరాళంగా వచ్చిన మొత్తంతో అసోసియేషన్ ఆఫ్ జపాన్ వారు ఐరాసకు ఒక గంటను బహూకరించారు. న్యూయార్క్‌లోని ఐరాస కేంద్ర కార్యాలయం ఆవరణలోని వెస్ట్‌కోర్ట్ తోటలో ఈ గంటను ఏర్పాటుచేశారు. ఏటా శాంతి దినోత్సవానికి సంబంధించిన కార్యక్రమాలను ఈ గంటను మోగించిన తర్వాత దీని సమీపంలోనే నిర్వహిస్తారు. 
 
దేశాలు, జాతులు, సమూహాలు తీవ్ర ఘర్షణల్లో మునిగి తేలుతున్నప్పటికీ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కాల్పుల విరమణ ప్రకటిస్తూ శాంతికోసం పలు కార్యక్రమాలను నిర్వహిస్తారు. ప్రపంచానికి శాంతిని ప్రబోధించేలా శాంతి గంటను మోగిస్తారు. 1981లో సెప్టెంబర్ 21న ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశం ప్రారంభ సందర్భంగా కోస్టారికా ఒక తీర్మానం సమర్పించింది. దాని ప్రకారం ఏటా సెప్టెంబర్ 21వ తేదిన ప్రపంచ శాంతి దినంగా జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం ప్రకటించింది. 
 
ప్రపంచ దేశాల మధ్య శాంతి ఒడంబడికపై సంతకాలు జరిగిన 50వ సంవత్సరం 2008 సెప్టెంబర్ 21వ తేది కూడా చరిత్రలో నమోదైంది. ప్రపంచ శాంతిని నెలకొల్పడంలో డెస్మండ్ టూటూ చేసిన కృషిని గుర్తించిన జేమ్స్ మాడిసన్ యూనివర్శిటీలోని మహాత్మా గాంధీ ప్రపంచ స్థాయి అహింసా కేంద్రం ఆయనకు పురస్కారాన్ని అందించాలని నిర్ణయించింది. ఈనెల 21న వర్జీనియాలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఆయనకు పురస్కారాన్ని అందజేస్తారు. 
 
ఈ శాంతి దినోత్సవాన్ని ఎవరైనా, ఎక్కడైనా ఈ దినోత్సవాన్ని నిర్వహించుకోవచ్చు. కొవ్వొత్తి వెలిగిస్తే చాలు. మౌనంగా కొద్దిసేపు కూర్చుని ధ్యానం చేసినా చాలు. సహోద్యోగులు, వివిధ సంస్థలు, స్థానిక ప్రభుత్వాలు దీన్ని నిర్వహించి శాంతి అవశ్యకతను ప్రజలకు చక్కగా వివరించవచ్చు. 
 
అందరూ ఆనందంతో ఉంటే ఆ దేశం ప్రగతికి చిహ్నంగా, విజయానికి మారుపేరుగా ఉంటుంది. శత్రుత్వం ద్వేషాన్ని పెంచి, చుట్టుపక్కల వారి మధ్య కలహాలతో మనశ్శాంతి, సుఖశాంతులు కరవవుతాయ. సమాజాభివృద్ధి కుంటుపడుతుంది. ప్రతి ఒక్కరూ ఆనందంతో, స్నేహభావంతో మెలిగితే ఏ దేశమైనా ఆనందనందనం అవుతుంది. అందుకే ప్రతి యేడాది శాంతి దినోత్సవాన్ని క్రమం తప్పకుండా ప్రపంచం నలువైపులా జరుపుకుంటుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కలగడం అపారమైన కృతజ్ఞతను నింపింది: రామ్ చరణ్

తెలుగు ప్రముఖ నటుడు రఘునాథ రెడ్డి ఇకలేరు

మెగా ఫ్యామిలీకి వారసుడొచ్చాడు.. తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉన్నారు : చిరంజీవి

మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు పుట్టారోచ్

ఫంకీ లో రట్టాటటావ్ గీతంలో విశ్వక్ సేన్, కయాదు లోహర్‌ కెమిస్ట్రీ వన్నెతెచ్చింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం, సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం

హైదరాబాదులో PMJ Jewels హాఫ్ శారీస్, పెళ్లి వేడుకల నగల డిజైన్ల ప్రదర్శన

winter health, గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసి తాగితే?

ఫ్యూజీఫిల్మ్ ఇండియా సరికొత్త సాంకేతికత అధునాతన ఇమేజింగ్, హెల్త్‌కేర్ ఐటి పరిష్కారాల ఆవిష్కరణ

హైదరాబాద్‌ ఐఆర్‌ఐఏ 2026లో బీపీఎల్ మెడికల్ టెక్నాలజీస్ అధునాతన ఇమేజింగ్, ఏఐ సామర్థ్యాల ప్రదర్శన

తర్వాతి కథనం
Show comments