Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా వద్ద నుంచి రూ. 5 కోట్ల విలువైన వాచీలు స్వాధీనం చేసుకున్నారా? పాండ్యా ట్వీట్

Webdunia
మంగళవారం, 16 నవంబరు 2021 (09:48 IST)
దుబాయ్ నుండి తిరిగి వచ్చినప్పుడు ముంబై విమానాశ్రయంలో తన నుండి రూ. 5 కోట్ల విలువైన రెండు చేతి గడియారాలను స్వాధీనం చేసుకున్నట్లు వచ్చిన వార్తలను క్రికెటర్ హార్దిక్ పాండ్యా మంగళవారం ఖండించారు. కేవలం రూ. 1.5 కోట్ల విలువైన ఒక వాచ్ మాత్రమే సరైన వాల్యుయేషన్ కోసం తీసుకున్నారని చెప్పాడు.

 
పాండ్యా ట్విట్టర్‌లో ఒక ప్రకటనను పోస్ట్ చేస్తూ, "నేను తీసుకువచ్చిన వస్తువులను చూపెట్టి అవసరమైన కస్టమ్స్ డ్యూటీని చెల్లించడానికి నేను స్వచ్ఛందంగా ముంబై విమానాశ్రయం కస్టమ్స్ కౌంటర్‌కు వెళ్లాను. కస్టమ్స్‌కు నా డిక్లరేషన్‌పై సోషల్ మీడియాలో తప్పుడు అవగాహనలు వెల్లువెత్తుతున్నాయి. ముంబై విమానాశ్రయంలో ఏమి జరిగిందో నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను."

 
"నేను దుబాయ్ నుండి చట్టబద్ధంగా కొనుగోలు చేసిన అన్ని వస్తువులను స్వచ్ఛందంగా ప్రకటించాను. చెల్లించాల్సిన సుంకాలు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాను. వాస్తవానికి, కస్టమ్స్ విభాగం సమర్పించిన అన్ని కొనుగోలు పత్రాలను కోరింది. అవి నేను సమర్పిస్తున్నాను. ఇంతలో మీడియాలో రాద్దాంతం చేస్తున్నారు'' అని ఆగ్రహం వ్యక్తం చేసారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments