నాస్తిక నేత కరుణానిధి స్వర్గ ప్రాప్తినా? వేదపండితులేమంటున్నారు...

తన జీవితంలో భగవంతుడిని నమ్మని పరమ నాస్తికుడిగా పేరు తెచ్చుకున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత దివంగత కరుణానిధి స్వర్గానికి వెళ్లారని తమిళనాడు పండితులు చెబుతున్నారు. నాస్తికవాది అయిన కరుణాని

Webdunia
శుక్రవారం, 10 ఆగస్టు 2018 (09:23 IST)
తన జీవితంలో భగవంతుడిని నమ్మని పరమ నాస్తికుడిగా పేరు తెచ్చుకున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత దివంగత కరుణానిధి స్వర్గానికి వెళ్లారని తమిళనాడు పండితులు చెబుతున్నారు. నాస్తికవాది అయిన కరుణానిధి ఏకాదశి (మంగళవారం) సాయంత్రం మృతి చెందటం, ద్వాదశి (బుధవారం)నాడు ఖననం చేయడంతో ఆయనకు స్వర్గ ప్రాప్తి లభిస్తుందని పండితులు వ్యాఖ్యానిస్తున్నారు.
 
నిజానికి ఏకాదశినాడు సూర్యాస్తమయం వేళ మరణించడం, ద్వాదశి ఘడియల్లో అంత్యక్రియలు జరగడంతో ఆయనకు స్వర్గ ప్రాప్తి లభించిందని, ఇటువంటి భాగ్యం అందరికీ లభించదని అంటున్నారు. నాస్తికుడైన కరుణ అరుదైన అదృష్టానికి నోచుకున్నారని చెబుతున్నారు. ఆయనకు మోక్షప్రాప్తి కలగాలని చిదంబరంలోని నటరాజస్వామి ఆలయం రాజగోపురంపై పూజారులు మోక్ష దీపాలను కూడా వెలిగించడం గమనార్హం. 
 
ఇంకోవైపు, కరుణానిధిపై దాఖలైన 13 పరువునష్టం కేసులను కొట్టి వేస్తూ చెన్నై ప్రిన్సిపల్‌ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులన్నీ దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత దాఖలు చేసిన కేసులు కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments