Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ్యాగీకేసు: మూడు పూటలూ మ్యాగీనే.. విడాకులు కోరిన భర్త

Webdunia
సోమవారం, 30 మే 2022 (16:29 IST)
Noodles
ఆసక్తికరమైన ఓ మ్యాగీకేసు ఇటీవల వెలుగులోకి వచ్చింది. భోజనం వండకుండా మ్యాగీ వండిందని భార్యకు భర్త విడాకుల ఇచ్చాడు. తన భార్యకు మ్యాగీ తప్ప మరేదీ వండటం రాదని తెలుసుకున్నాక ఆమె నుంచి తెగతెంపులు చేసుకోవాలని అనుకున్నాడు. అల్పాహారం, భోజనం ఏవీ చేయడం తెలియవని తెలియడంతో ఆమె నుంచి విడాకులు కోరాడు. 
 
ఈ కేసును విచారించిన న్యాయమూర్తి ఎంఎల్ రఘునాథ్ దీనిని "మ్యాగీ కేసు"గా అభివర్ణించారు, మహిళ ప్రొవిజన్ స్టోర్‌కు వెళ్లి మ్యాగీని మాత్రమే కొనుగోలు చేస్తుందని.. మరే వస్తువులను వండటం కోసం కొనదని భర్త ఫిర్యాదు చేశాడు. మూడు పూటలూ మ్యాగీ మాత్రమే వడ్డిస్తుందని వాపోయాడు. ఈ జంట పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారని రఘునాథ్ తెలిపారు.  ఇటీవల విడాకుల కేసులు పెరిగాయని రఘునాథ్ తెలిపారు. 
 
అలాగే వంట చేయడం అనేది ఒక ప్రాథమిక జీవన నైపుణ్యం, దీనిని ప్రతి ఒక్కరూ తమ కోసం ఎలా చేయాలో తెలుసుకోవాలని రఘునాథ్ చెప్పారు. 
 
కాగా ఇటీవల తన భార్య మటన్ కర్రీ వండడం లేదని ఫిర్యాదు చేయడానికి 100 సార్లు డయల్ చేసిన తెలంగాణకు చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇతడు కనగల్ మండలం చర్ల గౌరారం గ్రామానికి చెందిన నవీన్ అని తేలింది. ఇతడు మద్యం మత్తులో ఆ పని చేశాడని తేలింది. 

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments