Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబ్బు లేనప్పుడు ఇంటికి ఎందుకు తాళం వేశారు.. కలెక్టర్‌కు నోట్ రాసిన దొంగ

Webdunia
సోమవారం, 11 అక్టోబరు 2021 (15:29 IST)
Thief
ఓ దొంగ ప్రభుత్వ అధికారి నోట్ ప్యాడ్‌ను పెన్నును ఉపయోగించాడు. ఎందుకో తెలుసుకోవాలంటే... ఈ కథనంలోకి వెళ్లాల్సిందే. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లాలోని ఒక ప్రభుత్వ అధికారి నివాసంలోకి దొంగ చొరబడ్డాడు. 
 
అక్కడ తగినంత నగదు, విలువైన వస్తువులను కనుగొనలేకపోయినందుకు నిరాశకు గురైన ఒక దొంగ, “డబ్బు లేనప్పుడు ఇంటికి ఎందుకు తాళం వేశారు” అని అడిగిన నోట్‌ను అక్కడే వదిలేసి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. 
 
దొంగ రాసిన నోట్ కాపీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రస్తుతం జిల్లాలోని ఖటేగావ్ పట్టణంలో సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్‌డిఎమ్) గా నియమించబడిన త్రిలోచన్ సింగ్ గౌర్ నివాసంలో రూ.30,000 నగదు, కొన్ని ఆభరణాలు దొంగిలించబడ్డాయని కొత్వాలి పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ఉమ్రావ్ సింగ్ తెలిపారు.
 
పదిహేను రోజుల విరామం తర్వాత శనివారం రాత్రి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు దొంగతనం గురించి కలెక్టర్‌కు తెలిసింది. ఇంకా దొంగ రాసిన నోట్ దొరికింది. దొంగ నోట్ రాయడానికి ప్రభుత్వ అధికారి నోట్‌ప్యాడ్, పెన్ను ఉపయోగించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుమార్తెకు సెక్స్ టాయ్ బహుమతిగా ఇవ్వాలని భావించాను : నటి గౌతమి

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ల కాంత నుంచి ఫస్ట్ సింగిల్

ఆది పినిశెట్టి, చైతన్య రావు నటించిన ఓటీటీ స్ట్రీమింగ్ మయసభ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం
Show comments