Webdunia - Bharat's app for daily news and videos

Install App

శశికళ ఫోటోతో శ్రీవారి ఆలయంలోకి వెళ్ళి మ్రొక్కులు తీర్చుకున్న భక్తుడు.. ఎలా సాధ్యం..?

Webdunia
మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (19:00 IST)
తిరుమల శ్రీవారి ఆలయం అంటేనే ఎంతో భద్రత. అందులోను నిషేధిత వస్తువులు తీసుకెళ్ళకుండా టిటిడి విజిలెన్స్, నిఘాతో పాటు పోలీసులు అప్రమత్తంగా ఉంటారు. అలాంటి తిరుమలలో ఏకంగా ఒక తమిళ భక్తుడు జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళ ఫోటోతో ఆలయంలోకి వెళ్ళిపోయాడు. అది కూడా పార్టీ కండువాకు ఆలయానికి వెళ్ళి దర్సనం చేసుకున్నాడు. 
 
కడలూరుకు చెందిన ఆరూల్ జ్యోతి అనే భక్తుడు పార్టీ కండువా, శశికళ ఫోటోతో శ్రీవారి ఆలయ ప్రవేశ చేయడం ఇప్పుడు వివాదంగా మారుతోంది. అది కూడా శశికళ జైలు నుంచి బయటకు రావాలని, ఆమె సిఎం కావాలంటూ మ్రొక్కులు తీర్చుకున్నట్లు ఆలయం బయటకు వచ్చిన ఆ భక్తుడు మీడియాకు చెప్పాడు. దీంతో మీడియా ప్రతినిధులే అవాక్కయ్యారు.
 
తమిళ భక్తుడిని వెంటనే టిటిడి విజిలెన్స్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. భక్తుడు పార్టీ కండువా, ఫోటోలతో ఎలా లోపలికి ప్రవేశించాడన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. టిటిడి ఉన్నతాధికారులు మాత్రం ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments