ఇంటిని కాపాడలేని వారు దేశాన్ని ఎలా?: నితిన్ గడ్కరీ

Webdunia
సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (17:36 IST)
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలామంది కార్యకర్తలు ముందుగా తమ ఇంటిని, ఇల్లాలిని, పిల్లలను చూసుకోలేనివాళ్లు.. దేశాన్ని ఏం కాపాడుతారని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు మోదీని ఉద్దేశించినవేనని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.


ఇప్పటికే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గడ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కొన్ని రోజులకే.. నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజా జీవితంలో ఓటమిని అంగీకరించాలన్నారు. తాజాగా నాగపూ‌లో ఏబీవీపీ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. తన జీవితాన్ని దేశానికి అంకితం చేద్దామనుకుంటున్నానని చాలామంది కార్యకర్తలు చెప్తున్నారు. అలా ఓ వ్యక్తితో మాట్లాడినప్పుడు అతడి వివరాలను ఆరా తీశాను. అతనో దుకాణాన్ని నడపలేక దాన్ని మూసేసినట్లు విన్నాను. అంతేగాకుండా అతనికి భార్యాపిల్లల్ని కూడా సరిగ్గా చూసుకోలేదని అతని మాటలను బట్టి తెలుసుకున్నాను. 
 
అందుకే ముందు ఇంటి గురించి పట్టించుకోమని చెప్పానని నితిన్ వ్యాఖ్యానించారు. ఎందుకంటే ఇంటిని సరిగ్గా నడపలేని వ్యక్తి దేశాన్నెలా బాగు చేస్తాడని ప్రశ్నించాడు. అందుకు ముందు కుటుంబం, పిల్లల గురించి ఆలోచించండి.. తర్వాత పార్టీ గురించి ఆలోచిద్దామని ఆ కార్యకర్తకు చెప్పినట్లు నితిన్ గడ్కరీ చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

Sai Pallavi: పూజా హెగ్డేకు బ్యాడ్ లక్.. సాయిపల్లవికి ఆ ఛాన్స్..

Prabhas: ప్రభాస్ రాజా సాబ్ నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments