Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికలపై అత్యాచారాలకు పాల్పడితే ఇక మరణదండనే : ఆర్డినెన్స్‌కు ఆమోదం

బాలికలపై అత్యాచారాలకు పాల్పడే కామాంధులకు ఇకపై మరణశిక్షలను అమలు చేయనున్నారు. ఈ మేరకు కేంద్రం ఓ ఆర్డినెన్స్‌ను జారీచేసింది. ఈ ఆర్డినెన్స్‌లోని నిబంధన మేరకు 12 సంవత్సరాల వయసులోపు బాలలపై అత్యాచారాలకు పాల్

Webdunia
శనివారం, 21 ఏప్రియల్ 2018 (14:37 IST)
బాలికలపై అత్యాచారాలకు పాల్పడే కామాంధులకు ఇకపై మరణశిక్షలను అమలు చేయనున్నారు. ఈ మేరకు కేంద్రం ఓ ఆర్డినెన్స్‌ను జారీచేసింది. ఈ ఆర్డినెన్స్‌లోని నిబంధన మేరకు 12 సంవత్సరాల వయసులోపు బాలలపై అత్యాచారాలకు పాల్పడే నేరస్థులకు మరణ శిక్ష విధించాలని నిర్ణయించింది. ఈ మేరకు లైంగిక నేరాల నుంచి బాలలపరిరక్షణ చట్టానికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
 
శనివారం ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్ర కేబినెట్ మీటింగ్ జరిగింది. ఇందులో కేంద్ర మంత్రులు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, స్మృతి ఇరానీ, ఉమా భారతి, పీయూష్ గోయల్, హర్షవర్థన్, రవిశంకర్ ప్రసాద్, జేపీ నడ్డా తదితరులు పాల్గొన్నారు. 
 
ఈసమావేశంలో పోక్సో చట్టానికి సవరణలు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. 0-12 ఏళ్ల వయసు చిన్నారులపై అత్యాచారం జరిపేవారికి మరణ దండన ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపింది. దీన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు పంపుతారు. దీనికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన తర్వాత ఆర్డినెన్స్ జారీఅవుతుంది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం