Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిమ్స్‌లో కంపౌడర్‌కు కరోనా - సెల్ఫ్ క్వారంటైన్‌కు వైద్యులు

Webdunia
శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (16:57 IST)
దేశంలోనే అత్యున్నతమైన వైద్య సంస్థ అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో పని చేసే ఓ కంపౌండర్‌కు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో అతని వార్డులో పని చేసే 40 మంది వైద్యులతో పాటు ఇతర వైద్య సిబ్బంది సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. 
 
మరోవైపు సదరు కంపౌండర్‌ పని చేసే వార్డులోని రోగుల శాంపిళ్లను కూడా సేకరించి కరోనా నిర్ధారణ పరీక్షలకు పంపారు. వీరిలో ఇప్పటివరకు 22 మంది రిపోర్టులు రాగా... అందరికీ నెగెటివ్ అని తేలింది. మిగిలిన వారి రిపోర్టుల కోసం ఎదురు చూస్తున్నారు.
 
కరోనా బారిన పడిన కంపౌండర్‌కు తనకు జ్వరంగా ఉందంటూ గత శనివారం ఫోన్ ద్వారా వైద్యులను సంప్రదించాడు. సోమవారం ఆస్పత్రికి వచ్చి టెస్టులు చేయించుకోవాలని వైద్యులు సలహా ఇచ్చారు. 
 
సోమవారం డ్యూటీ ఉండటంతో... బుధవారం టెస్టులు చేయించుకున్నాడు. కరోనా సోకినట్టు అదే రోజు రాత్రి రిపోర్టు వచ్చింది. మరుసటి రోజు (గురువారం) ఈ విషయం అందరికీ తెలిసింది. 
 
ప్రస్తుతం అతను ఎయిమ్స్‌లోనే చికిత్స పొందుతున్నాడు. అతనికి కరోనా సోకడంతో... అతను పని చేస్తున్న గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలోని మొత్తం సిబ్బందిని సెల్ఫ్ క్వారంటైన్‌కు వెళ్లాలని అధికారులు సూచించారు. దీంతో, వారంతా క్వారంటైన్ కు వెళ్లారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ ఐడియాలను ఫిలింఛాంబర్ గాలికొదిలేసిందా?

ఫుట్ బాల్ నేపథ్యంలో డ్యూడ్ చిత్రం టీజర్ వచ్చేస్తోంది

విజయ్ ఆంటోనీ మార్గన్ హక్కుల్ని దక్కించుకున్న ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments