Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిమ్స్‌లో కంపౌడర్‌కు కరోనా - సెల్ఫ్ క్వారంటైన్‌కు వైద్యులు

Webdunia
శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (16:57 IST)
దేశంలోనే అత్యున్నతమైన వైద్య సంస్థ అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో పని చేసే ఓ కంపౌండర్‌కు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో అతని వార్డులో పని చేసే 40 మంది వైద్యులతో పాటు ఇతర వైద్య సిబ్బంది సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. 
 
మరోవైపు సదరు కంపౌండర్‌ పని చేసే వార్డులోని రోగుల శాంపిళ్లను కూడా సేకరించి కరోనా నిర్ధారణ పరీక్షలకు పంపారు. వీరిలో ఇప్పటివరకు 22 మంది రిపోర్టులు రాగా... అందరికీ నెగెటివ్ అని తేలింది. మిగిలిన వారి రిపోర్టుల కోసం ఎదురు చూస్తున్నారు.
 
కరోనా బారిన పడిన కంపౌండర్‌కు తనకు జ్వరంగా ఉందంటూ గత శనివారం ఫోన్ ద్వారా వైద్యులను సంప్రదించాడు. సోమవారం ఆస్పత్రికి వచ్చి టెస్టులు చేయించుకోవాలని వైద్యులు సలహా ఇచ్చారు. 
 
సోమవారం డ్యూటీ ఉండటంతో... బుధవారం టెస్టులు చేయించుకున్నాడు. కరోనా సోకినట్టు అదే రోజు రాత్రి రిపోర్టు వచ్చింది. మరుసటి రోజు (గురువారం) ఈ విషయం అందరికీ తెలిసింది. 
 
ప్రస్తుతం అతను ఎయిమ్స్‌లోనే చికిత్స పొందుతున్నాడు. అతనికి కరోనా సోకడంతో... అతను పని చేస్తున్న గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలోని మొత్తం సిబ్బందిని సెల్ఫ్ క్వారంటైన్‌కు వెళ్లాలని అధికారులు సూచించారు. దీంతో, వారంతా క్వారంటైన్ కు వెళ్లారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

జేమ్స్ కామెరూన్ అవతార్: ఫైర్ అండ్ యాష్ తెలుగు ట్రైలర్ ఇప్పుడు విడుదల

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments