Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్కో ఉద్యోగికి రూ.70 కోట్లు బోనస్‌గా పంచిన కంపెనీ.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 31 జనవరి 2023 (11:07 IST)
త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం రాబోతున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో అనేక టెక్ కంపెనీలు తమవద్ద పనిచేసే ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. కానీ, చైనాకు చెందిన క్రేన్ తయారీ సంస్థ మాత్రం ఏకంగా తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులందరికీ బోనస్ ప్రకటించి ప్రపంచం నివ్వెరపోయేలా చేసింది. ఆ బోనస్ కూడా వందల్లో వేలల్లో కాదు.. ఏకంగా కోట్లలో ఉండటం ప్రతి ఒక్కరూ నోరు వెళ్లబెట్టేలా చేసింది.
 
చైనాకు చెందిన హెనాన్ మైన్ అనే కంపెనీ క్రేన్ల తయారు చేస్తుంది. గత యేడాది కరోనా కారణంగా పలు కంపెనీలు ఆర్థికంగా తీవ్రమైన నష్టాలను చవిచూశాయి. కానీ, హెనాన్ మైన్ సంస్థకు మాత్రం భారీ లాభాలను అర్జించింది. దీంతో కంపెనీ లాభాలకు కారణమైన ఉద్యోగులకు బోనస్ ఇవ్వాలని కంపెనీ యాజమాన్యం నిర్ణయించింది. 
 
అందులోభాగంగా కంపెనీ సేల్ విభాగంలో మంచి పనితీరు కనబరచిన 30 మందికి పైగా ఉద్యోగులకు 61 మిలియన్ యునాన్లు (భారత కరెన్సీలో రూ.73 కోట్లు) బోనస్‌గా ప్రకటించింది. ఈ మొత్తాన్ని ఉద్యోగులకు పంచేందుకు ఓ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసింది. ఇందులో రూ.73 కోట్లను నగదు నోట్ల కట్టల రూపంలో అందజేసింది. 
 
మరో ముగ్గరు ఉద్యోగులకు రూ.6 కోట్లు, మిగిలిన ఒక్కొక్కరికీ ఒక మిలియన్ యువాన్లు (రూ.1.20 కోట్లు) బోనస్‌గా ఇచ్చింది. దీంతో కంపెనీ అందించిన నోట్ల కట్టలను ఉద్యోగులు చేతులతో తీసుకెళుతున్న వీడియోలను చైనా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments