Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాబిల్లికి మరింత చేరువగా చంద్రయాన్-2

Webdunia
గురువారం, 29 ఆగస్టు 2019 (14:10 IST)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 2 వ్యోమనౌక.. జాబిల్లికి మరింత చేరువైంది. మరో 10 లేదా 11 రోజుల్లో చంద్రుడి చెంతకు చేరనుందని ఇస్రో వెల్లడించింది. మరోవైపు, బుధవారం ఉదయం 09.04 గంటలకు మూడోసారి కక్ష్య కుదింపు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఇస్రో వెల్లడించింది. 1190 సెకన్లపాటు ప్రొపల్షన్‌ సిస్టమ్‌ను మండించి 179 కి.మీ.x 1412 కి.మీ. కక్ష్యలోకి చంద్రయాన్‌-2ను విజయవంతంగా చేర్చినట్లు పేర్కొంది. 
 
తదుపరి కక్ష్య కుదింపు ప్రక్రియను ఈ నెల 30వ తేదీన సాయంత్రం 6-7 గంటల మధ్య చేపట్టనున్నట్లు తెలిపింది. అనంతరం సెప్టెంబర్‌ 1న మరోసారి కక్ష్యను కుదిస్తారు. సెప్టెంబర్‌ 2న ఆర్బిటార్‌ నుంచి ల్యాండర్‌ విడిపోయే ప్రక్రియను చేపడుతారు. సెప్టెంబర్‌ 7న వేకువజామున 1.55 గంటలకు ల్యాండర్‌ విక్రమ్‌.. చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో కాలుమోపుతుందని ఇస్రో తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments