Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాబిల్లికి మరింత చేరువగా చంద్రయాన్-2

Webdunia
గురువారం, 29 ఆగస్టు 2019 (14:10 IST)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 2 వ్యోమనౌక.. జాబిల్లికి మరింత చేరువైంది. మరో 10 లేదా 11 రోజుల్లో చంద్రుడి చెంతకు చేరనుందని ఇస్రో వెల్లడించింది. మరోవైపు, బుధవారం ఉదయం 09.04 గంటలకు మూడోసారి కక్ష్య కుదింపు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఇస్రో వెల్లడించింది. 1190 సెకన్లపాటు ప్రొపల్షన్‌ సిస్టమ్‌ను మండించి 179 కి.మీ.x 1412 కి.మీ. కక్ష్యలోకి చంద్రయాన్‌-2ను విజయవంతంగా చేర్చినట్లు పేర్కొంది. 
 
తదుపరి కక్ష్య కుదింపు ప్రక్రియను ఈ నెల 30వ తేదీన సాయంత్రం 6-7 గంటల మధ్య చేపట్టనున్నట్లు తెలిపింది. అనంతరం సెప్టెంబర్‌ 1న మరోసారి కక్ష్యను కుదిస్తారు. సెప్టెంబర్‌ 2న ఆర్బిటార్‌ నుంచి ల్యాండర్‌ విడిపోయే ప్రక్రియను చేపడుతారు. సెప్టెంబర్‌ 7న వేకువజామున 1.55 గంటలకు ల్యాండర్‌ విక్రమ్‌.. చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో కాలుమోపుతుందని ఇస్రో తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments