కావేరి చిచ్చు : అట్టుడుకుతున్న తమిళనాడు.. 5న రాష్ట్ర బంద్

తమిళనాడులో కావేరి చిచ్చురాజుకుంది. కావేరీ జలాల పంపిణీ కోసం కావేరీ జల మండలిని ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు బేఖాతర్ చేసింది.

Webdunia
సోమవారం, 2 ఏప్రియల్ 2018 (10:37 IST)
తమిళనాడులో కావేరి చిచ్చురాజుకుంది. కావేరీ జలాల పంపిణీ కోసం కావేరీ జల మండలిని ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు బేఖాతర్ చేసింది. పైగా, కావేరీ బోర్డు ఏర్పాటులో మరింత స్పష్టత కావాలంటూ కేంద్రం సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేయడం గమనార్హం. 
 
ఇది తమిళనాడులోని అన్ని రాజకీయ పార్టీలకు ఆగ్రహం తెప్పించింది. సుప్రీంకోర్టు తీర్పు మేరకు కావేరి జల మండలిని ఏర్పాటు చేయని కేంద్ర ప్రభుత్వ వైఖరిని అధికార పార్టీతో పాటు.. అన్ని విపక్ష పార్టీలు ఎండగడుతున్నాయి. ఈ ఆందోళన భాగంగా, ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో 5న రాష్ట్ర బంద్‌ నిర్వహించాలని నిర్ణయించారు. 
 
ఈ సమావేశం అనంతరం డీఎంకే నేత ఎంకే స్టాలిన్‌, టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఎస్‌.తిరునావుక్కరసర్‌, సీపీఐ, సీపీఎం నేతలు ముత్తరసన్‌, బాలకృష్ణన్‌, డీకే నాయకుడు కె. వీరమణి, డీపీఐ నాయకుడు తొల్‌ తిరుమావళవన్‌, ఆయా పార్టీలకు చెందిన వేలాదిమంది కార్యకర్తలు చెన్నై వళ్లువర్‌కోట్టమ్‌ వద్ద ఆకస్మికంగా రాస్తారోకో నిర్వహించారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. 
 
మరోవైపు, అన్నాడీఎంకేకు రాజ్యసభ సభ్యుడు ముత్తుకరుప్పన్ తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. కావేరీ జల మండలిని ఏర్పాటు చేయనందుకు నిరసనగా తాను రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఇది అధికార పార్టీకి చెందిన ఎంపీలపై మరింత ఒత్తిడి పెంచినట్టయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bandla Ganesh: బండ్ల గణేష్ పై ఇండస్ట్రీ సీరియస్ - గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయలేనా?

Manoj: ఎవరినీ మోసం చేయను, మౌనిక ను బాగా చూసుకుంటా : మంచు మనోజ్

ప్రైమ్ వీడియోలో మా దృష్టి గొప్ప కథలను నిర్మించడం మీదే ఉంది - పద్మా కస్తూరిరంగన్

ప్రణవ్ మోహన్ లాల్.. డీయస్ ఈరే... శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా విడుదల

పురుషః పాత్రల ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments