చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇస్తున్నారా? పిల్లి బిర్యానీ వస్తుంది.. జాగ్రత్త.. ఎక్కడంటే? (Video)

Webdunia
మంగళవారం, 27 ఆగస్టు 2019 (10:38 IST)
చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇస్తున్నారా? కాస్త జాగ్రత్త పడండి. విశాఖ హోటళ్లలో పిల్లుల మాంసంతో బిర్యానీ వండుతున్నారనే షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది. భక్తుల ముసుగులో హోటళ్లకు, రెస్టారెంట్లకు పిల్లి మాంసాన్ని విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో..  పోలీసులు నిందితుల్ని పట్టుకున్నారు. 
 
ఆరుగురు సభ్యులతో కూడిన ఈ ముఠాతో పాటు పోలీసులు వ్యానును కూడా పట్టుకున్నారని సమాచారం. పోలీసులు ఈ వ్యానులో ఒక చనిపోయిన పిల్లితో పాటు ఒక బ్రతికి ఉన్న పిల్లిని గుర్తించారు. చనిపోయిన పిల్లిని పోలీసులు పోస్టుమార్టం కొరకు తరలించారు. ఈ ముఠాలోని సభ్యులు గుంటూరు జిల్లాలోని బెల్లంకొండ మండలం చినరాజుపాలెంకు చెందిన వ్యక్తులుగా పోలీసుల విచారణలో తేలింది. 
 
ముందుగా రెక్కీ నిర్వహించే ఈ ముఠా పిల్లులను వేటాడి.. ఆ మాంసాన్ని రెస్టారెంట్లకు అమ్ముతుంది. ఈ ముఠాలోని సభ్యులు గుంటూరు జిల్లాలోని బెల్లంకొండ మండలం చినరాజుపాలెంకు చెందిన వ్యక్తులుగా పోలీసుల విచారణలో తేలింది.
 
గతంలో కూడా చెన్నై నగరంలో పిల్లి మాంసం కలిపిన బిర్యాని విక్రయిస్తున్నారని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. రెస్టారెంట్లే కాకుండా రోడ్డు పక్కన బిర్యానీ అమ్మేవారు ఎక్కువగా పిల్లి మాంసాన్ని చికెన్ ముక్కల్లో కలిపి విక్రయించారనే విషయం వెలుగులోకి వచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్‌లో మతపరమైన వివక్ష ఉందా? రెహ్మాన్‌ను నిలదీసిన కంగనా రనౌత్

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న మన శంకరవరప్రసాద్ గారు

భారత్ నాకు స్ఫూర్తి - నా దేశం నా గురువు - నా ఇల్లు కూడా : ఏఆర్ రెహ్మాన్

Ramcharan: ఫైర్ మీదున్నా.. తర్వాతి సవాల్‌కు సిద్ధం అంటున్న రామ్ చరణ్

వార్నీ... ఆ చిత్రంపై మోహన్ బాబు ఏమీ మాట్లాడకపోయినా బిగ్ న్యూసేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాన్సర్ అవగాహనకు మద్దతుగా 2026 ముంబయి మారథాన్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పరివర్తన్

పురుషుల కంటే మహిళలు చలికి వణికిపోతారు, ఎందుకని?

గుండెకి ఈ పండ్లు ఆరోగ్యం

అల్పాహారం, ఒత్తిడి, రాత్రిపూట నిద్ర... మధుమేహంతో లింక్

హైదరాబాద్‌లో తమ 25 ఏళ్ల కార్యకలాపాలను వేడుక జరుపుకున్న టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments