Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర బడ్జెట్ 2023 తర్వాత భారీగా పెరగనున్న ఈ వస్తువుల ధరలు మరింత ప్రియం!

Webdunia
మంగళవారం, 10 జనవరి 2023 (18:48 IST)
వచ్చే నెలాఖరులో కేంద్ర వార్షిక బడ్జెట్ 2023-24ను విత్తమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ తర్వాత పలు రకాల వస్తువుల ధరలు పెరిగే సూచనలు ఉన్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు ఇప్పటికే సంకేతాలు పంపించాయి. అందుకు అనుగుణంగా ప్రస్తుతం వార్షిక బడ్జెట్ రూపకల్పన సాగుతోంది. 
 
వివేకంతో ఆర్థిక నిర్వహణతో పాటు దీర్ఘకాల వృద్ధికి కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తుందన్నారు. దీర్ఘకాల లక్ష్యాల్లో భాగంగా బడ్జెట్ ప్లాన్స్‌లో కస్టమ్స్ డ్యూటీ పెంపు ఉండొచ్చని ఎకనామిక్స్ టైమ్స్ నివేదిక వెల్లడించింది. కస్టమ్స్ డ్యూటీ పెంపు సాధ్యాసాధ్యలకు సంబంధించి మొత్తం 35 వస్తువుల జాబితాను కేంద్రం సిద్ధం చేస్తుందని పేర్కొంది. 
 
ఈ జాబితాలో అధిక విలువైన కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు, కొన్ని ప్లాస్టిక్ వస్తువులు, నగలు, హై గ్లాస్ పేపర్, విటమిన్స్, ప్రైవేట్ జెట్స్, హెలికాఫ్టర్స్‌ తదితరాలు ఉన్నాయి. అదేసమయంలో దిగుమతులను గణనీయంగా తగ్గించి దేశీయంగా తయారీ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చేలా ప్రభుత్వం దృష్టిసారించింది. నిత్యావసరం కాని వాటిని ఎక్సైజ్ సుంకం పరిధిలోకి తేవాలన్నది ప్రభుత్వ ఉద్దేశంగా ఉన్నట్టు తెలుస్తుంది. దీనివల్ల అనవసర దిగుమతులను తగ్గించుకోవడంతో పాటు, ఆదాయం పెంచుకునే వ్యూహం కనిపిస్తుంది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments