Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫ్రిడ్జ్‌లో ఈ పదార్థాలు నిల్వ వుంచకూడదు, ఎందుకో తెలుసా?

Advertiesment
onions
, శుక్రవారం, 16 డిశెంబరు 2022 (23:23 IST)
చాలామంది బయట మార్కెట్ నుంచి కొనుగోలు చేసి తీసుకువచ్చిన పదార్థాలను ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తుంటారు. కానీ కొన్ని పదార్థాలను ఫ్రిడ్జ్‌లో పెడితో పాడయిపోతాయి. ఆ పదార్థాలలో కొన్నింటి గురించి తెలుసుకుందాము.
 
తేనెలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని ఫ్రిడ్జ్‌లో నిల్వ ఉంచడం వల్ల దాని లక్షణాలపై చెడు ప్రభావం పడుతుంది. 
 
ఫ్రిడ్జ్‌లో దోసకాయలను నిల్వ చేయడం వల్ల అవి నీరు, గుంటలుగా మారుతాయి. అందువల్ల వాటిని ప్లాస్టిక్‌లో చుట్టి పెట్టడం ఉత్తమం.
 
ఉల్లిపాయలు ఫ్రిడ్జ్‌లో పెడితే మెత్తగా, బూజు పట్టినట్లు మారుతాయి. కనుక ఉల్లిని ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదు.
 
ఉల్లిపాయల మాదిరిగా వెల్లుల్లిని కూడా చల్లని, పొడి ప్రదేశంలో ఉంచడం మంచిది. శీతలీకరణ వల్ల అది రబ్బరులా మారుతుంది.
 
బంగాళాదుంపలను ఫ్రిడ్జ్‌లో వుంచితే నుండి అదనపు తేమతో తీపిగా మారుతాయి. కొన్నిసార్లు వాటికి మొలక కూడా వస్తుంది. అవి హానికరం.
 
టొమాటోలను గది ఉష్ణోగ్రత వద్ద ఉంచడం వలన అవి సరైన రుచి, రసాన్ని కలిగి ఉంటాయి. ఫ్రిడ్జ్‌లో పెడితే వీటిని కోల్పోతాయి.
 
అరటిపండ్లు పండడానికి వెచ్చని ఉష్ణోగ్రతలు అవసరం. ఫ్రిడ్జ్‌లో పెడితే నల్లగా మారిపోతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మొలకెత్తిన గింజలు తింటే?