చంద్రబాబు ఓ వేస్ట్ ఫెలో... వైకాపా నేత బొత్స ఫైర్

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైకాపా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విమర్శల వర్షం కురిపించారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, విభజన చట్టంలోని హామీ మేరకు ఏపీకి రైల్వేజోన్ తేలేని అసమ

Webdunia
ఆదివారం, 10 జూన్ 2018 (17:05 IST)
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైకాపా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విమర్శల వర్షం కురిపించారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, విభజన చట్టంలోని హామీ మేరకు ఏపీకి రైల్వేజోన్ తేలేని అసమర్థుడు చంద్రబాబు అని మండిపడ్డారు.
 
గత అసెంబ్లీ ఎన్నికల్లో లేనిపోని అసత్య వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గత నాలుగేళ్లలో సాధించింది అవినీతి తప్ప ఏమీ లేదన్నారు. ఏపీలో పాలనను చంద్రబాబు గాలికి వదిలేసి, ప్రతిపక్షంపై విమర్శలు చేయడమే దినచర్యగా పెట్టుకున్నారని విమర్శించారు. 
 
టీడీపీ పాలనలో జరిగిన అవినీతిని ప్రశ్నిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్, తితిదే మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులపై ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. అవినీతి విషయంలో బీహార్‌ను ఏపీ మించిందిపోయిందని, ఏపీలో అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయని ఆరోపించారు. మట్టి, ఇసుక, మద్యం,మాఫియాను రాష్ట్రంలో పెంచి పోషిస్తున్నారని, అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయలేదని విమర్శించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చీరకట్టులో నభా నటేశ్ దీపావళి వేడుకలు

చిరంజీవి నివాసంలో మెగా దీపావళి వేడుకలు.. అతిథిలు వీరే

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments