బీజేపీకి షాకివ్వనున్న జేడీయు : ఒంటరిపోరుకు సై అంటూ సంకేతాలు

భారతీయ జనతా పార్టీకి చెందిన మరో భాగస్వామ్య పార్టీ అయిన జేడీయు కూడా ఆ కూటమికి షాకివ్వనుంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిపోరుకు సై అంటూ సంకేతాలు పంపించింది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేయ

Webdunia
సోమవారం, 25 జూన్ 2018 (15:51 IST)
భారతీయ జనతా పార్టీకి చెందిన మరో భాగస్వామ్య పార్టీ అయిన జేడీయు కూడా ఆ కూటమికి షాకివ్వనుంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిపోరుకు సై అంటూ సంకేతాలు పంపించింది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేయడం వల్ల తమకెలాంటి అభ్యంతరాలు లేవని ఆ పార్టీ నేతలు తేల్చి చెప్పారు.
 
ఇదే అంశంపై జేడీయు అధికార ప్రతినిధి సంజయ్ సింగ్ స్పందిస్తూ, 'బీజేపీకి తన మిత్రపక్షాల సాయం అవసరం లేదనుకుంటే.. రాష్ట్రంలోని మొత్తం 40 స్థానాల్లో ఆ పార్టీ ఒంటరిగా పోటీచేయవచ్చు. వారికి ఎవరూ అడ్డుచెప్పడం లేదు. సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం ప్రతిపార్టీకీ ఉంది. ఒకవేళ వారు నిర్ణయం తీసుకుంటే తీసుకోవచ్చు. మాకు ఎలాంటి సమస్యా లేదు' అని చెప్పారు.
 
'2014 ఎన్నికలకు, 2019కి చాలా తేడా ఉంది. దేశంలో ఆయా అంశాల ఆధారంగా రాజకీయాలు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఎన్నికల్లో ఉండే అంశాలు 2014 కంటే చాలా భిన్నంగా ఉంటాయి. కాబట్టి నితీశ్ లేకుండా బీహార్‌లో నెగ్గడం కష్టమని బీజేపీకి బాగా తెలుసు' అని సంజయ్ వ్యాఖ్యానించారు.
 
2015 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 243 స్థానాలకుగానూ జేడీయూ 71 స్థానాలు గెలుచుకోగా, బీజేపీ 53 స్థానాలు దక్కించుకుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బట్టి తాము బీజేపీ కంటే బలంగా ఉన్నామంటున్న జేడీయూ.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే తరపున రాష్ట్రంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు కేటాయించాలన్న నిర్ణయం తమకే వదిలేయాలని పట్టుపడుతోంది. కానీ, బీజేపీ నేతలు మాత్రం ససేమిరా అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments