Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీకి షాకివ్వనున్న జేడీయు : ఒంటరిపోరుకు సై అంటూ సంకేతాలు

భారతీయ జనతా పార్టీకి చెందిన మరో భాగస్వామ్య పార్టీ అయిన జేడీయు కూడా ఆ కూటమికి షాకివ్వనుంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిపోరుకు సై అంటూ సంకేతాలు పంపించింది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేయ

Webdunia
సోమవారం, 25 జూన్ 2018 (15:51 IST)
భారతీయ జనతా పార్టీకి చెందిన మరో భాగస్వామ్య పార్టీ అయిన జేడీయు కూడా ఆ కూటమికి షాకివ్వనుంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిపోరుకు సై అంటూ సంకేతాలు పంపించింది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేయడం వల్ల తమకెలాంటి అభ్యంతరాలు లేవని ఆ పార్టీ నేతలు తేల్చి చెప్పారు.
 
ఇదే అంశంపై జేడీయు అధికార ప్రతినిధి సంజయ్ సింగ్ స్పందిస్తూ, 'బీజేపీకి తన మిత్రపక్షాల సాయం అవసరం లేదనుకుంటే.. రాష్ట్రంలోని మొత్తం 40 స్థానాల్లో ఆ పార్టీ ఒంటరిగా పోటీచేయవచ్చు. వారికి ఎవరూ అడ్డుచెప్పడం లేదు. సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం ప్రతిపార్టీకీ ఉంది. ఒకవేళ వారు నిర్ణయం తీసుకుంటే తీసుకోవచ్చు. మాకు ఎలాంటి సమస్యా లేదు' అని చెప్పారు.
 
'2014 ఎన్నికలకు, 2019కి చాలా తేడా ఉంది. దేశంలో ఆయా అంశాల ఆధారంగా రాజకీయాలు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఎన్నికల్లో ఉండే అంశాలు 2014 కంటే చాలా భిన్నంగా ఉంటాయి. కాబట్టి నితీశ్ లేకుండా బీహార్‌లో నెగ్గడం కష్టమని బీజేపీకి బాగా తెలుసు' అని సంజయ్ వ్యాఖ్యానించారు.
 
2015 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 243 స్థానాలకుగానూ జేడీయూ 71 స్థానాలు గెలుచుకోగా, బీజేపీ 53 స్థానాలు దక్కించుకుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బట్టి తాము బీజేపీ కంటే బలంగా ఉన్నామంటున్న జేడీయూ.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే తరపున రాష్ట్రంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు కేటాయించాలన్న నిర్ణయం తమకే వదిలేయాలని పట్టుపడుతోంది. కానీ, బీజేపీ నేతలు మాత్రం ససేమిరా అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments