ఆమె గొప్ప తల్లి.. త్వరలోనే కలుస్తాను : సీఎం కుమార స్వామి

కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమార స్వామి ఓ మహిళను గొప్ప తల్లిగా అభివర్ణించారు. "అమ్మా నీకు వందనం. నీవు గొప్ప తల్లివి.. నిన్ను త్వరలోనే కలుస్తా"నంటూ ట్వీట్ చేశారు.

Webdunia
గురువారం, 7 జూన్ 2018 (09:26 IST)
కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమార స్వామి ఓ మహిళను గొప్ప తల్లిగా అభివర్ణించారు. "అమ్మా నీకు వందనం. నీవు గొప్ప తల్లివి.. నిన్ను త్వరలోనే కలుస్తా"నంటూ ట్వీట్ చేశారు. 
 
ఇంతకు ముఖ్యమంత్రి కుమార స్వామి ఆ మహిళను అంతగా ప్రశించడానికి గల కారణాలేంటో పరిశీలిస్తే, బెంగళూరుకు చెందిన మహిళా కానిస్టేబుల్‌. పేరు అర్చన. అయితేనేం.. అమ్మగా స్పందించి ఓ అనాథ బిడ్డకు స్తన్యమిచ్చింది. ఆ బిడ్డ ప్రాణాలు కాపాడింది.
 
బెంగళూరు శివారులో ఉన్న భవనం వద్ద ప్లాస్టిక్‌ కవర్‌లో చుట్టిన బిడ్డను స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వారు చిన్నారిని స్టేషన్‌కు తరలించారు. శిశువు పరిస్థితి ప్రమాదకరంగా ఉండటంతో.. మూడు నెలల బాలింత అర్చన పాలిచ్చింది. 
 
ఓ తల్లిగా స్పందించి ఆ శిశువు ప్రాణం కాపాడింది. ఈ విషయాన్ని పోలీసులు ఫోటోతీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే.. ఆమెను నెటిజన్లు అభినందలతో ముంచెత్తుతున్నారు. ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా అర్చనను ప్రశంసించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్ట్రీమింగ్‌లో Netflix, నిజం, అధికారము, భావనలను ప్రశ్నించే సైకాలజికల్ డ్రామా Accused

Virosh couple : అమిత్ షా, ప్రధానిని కలిసిన విరోష్ జంట

Vishnu Vinyasam Review: శ్రీ విష్ణు చేసిన విష్ణు విన్యాసం.. బెడిసి కొట్టిందా? రివ్యూ

Rajiv Kanakala: ఓటీటీ చిత్రం D/o ప్రసాద్ రావు : కనబడుటలేదు రివ్యూ

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ కొత్త పోస్టర్ - త్వరలోనే ప్రత్యేక గ్లింప్స్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధునాతన మధుమేహ నిర్వహణ కోసం నోవో నార్డిస్క్ ఇండియాతో అబాట్ భాగస్వామ్యం

నిద్రలేమి ఎన్నో ఇబ్బందులు.. ఆరోగ్యానికి చేటు.. అమెరికా వైద్యులు

వయసు పైబడకుండా చేసే బాదం పప్పు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తుమ్ములు, వదలని దగ్గు వస్తే HMPV వ్యాధి కావచ్చు, ఏం చేయాలి?

తులసి రసంతో తేనెను కలిపి తీసుకుంటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments