Webdunia - Bharat's app for daily news and videos

Install App

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

ఐవీఆర్
బుధవారం, 16 ఏప్రియల్ 2025 (20:55 IST)
బల్గేరియాకు చెందిన బాబా వంగా గురించి తెలియనివారు వుండరు. బాబా వంగా నోటి నుంచి ఏదన్నా వస్తుందంటే, అది నిజమై తీరుతుందని విశ్వసించేవారు ఈ ప్రపంచంలో చాలామంది వున్నారు. బాబా వంగా మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఎందుకంటే... మరో వెయ్యి లేదా 2 వేల సంవత్సరాలకు చంద్రుడు లేకుండా పోతాడట. చందమామను పెద్ద గ్రహశకలం ఒకటి ఢీకొట్టి చంద్రుడు బూడిదలా మారిపోయి శూన్యంలో కలిసిపోతాడట. దీనితో భూమికి వున్నటువంటి ఒకే ఒక్క ఉపగ్రహం, వెన్నెల వెలుగులు పంచే చందమామ లేకుండా పోతాడట.
 
ఫలితంగా భూమిపైన పెనుమార్పులు ఏర్పాడతాయట. మానవ జాతితో పాటు జంతువులు, పక్షులు, జలచరాలు, వృక్షాలు... ఇలా అన్నింటిలోనూ వైవిధ్యం ఏర్పడి నశించడం మొదలుపెడుతుందట. వాతావరణంలో పెనుమార్పులు సంభవించి మానవ జాతి మనుగడ కష్టతరంగా మారుతుందట. 5079 నాటికి భూమి పైన మానవ జాతి పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందట. అంతేకాదు... భూమి కూడా అంతర్థానం అయిపోయే అవకాశం కూడా వున్నదట. ఈ భయంకరమైన ఘటనలు జరుగుతాయని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేనప్పటికీ బాబా వంగా మాత్రం తన జ్యోతిషం ద్వారా ఇవన్నీ జరుగుతాయని చెబుతున్నారు.
 
ఇంతకుముందు బాబా వంగా చెప్పినవి జరిగినవి కూడా వున్నాయి. నవంబర్ నెలలో వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ పైన దాడి, కోవిడ్ 19 విధ్వంసం, ప్రిన్సెస్ డయానా మరణం వంటివి బాబా వంగా చెప్పినవాటిలో వున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments