Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబుగారూ.. ఢిల్లీకి రండి.. రైల్వే జోన్ ఇస్తాం... విత్తమంత్రి ఫోన్

టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మరోమారు కమలనాథుల నుంచి పిలుపువచ్చింది. ఓసారి ఢిల్లీకి వస్తే కూర్చొని అన్ని విషయాలు మాట్లాడుకుందామంటూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నుంచి ఆయనకు కబు

Webdunia
శుక్రవారం, 23 మార్చి 2018 (11:21 IST)
టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మరోమారు కమలనాథుల నుంచి పిలుపువచ్చింది. ఓసారి ఢిల్లీకి వస్తే కూర్చొని అన్ని విషయాలు మాట్లాడుకుందామంటూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నుంచి ఆయనకు కబురు వచ్చింది. 
 
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తనకు ఫోన్ చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు తన పార్టీ నేతలతో చెప్పారు. ముఖ్యంగా, విశాఖ రైల్వేజోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ సహా విభజన హామీలన్నింటినీ నెరవేరుస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. 
 
అయితే, ప్రత్యేక హోదా గురించి మాత్రం మాట్లాడలేదని... ఇప్పుడు మనం ఏంచేద్దాం అని టీడీపీ నేతలను అడిగారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలసి ఢిల్లీలో ఉన్న ఎంపీలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
 
ఈ సందర్భంగా యనమల మాట్లాడుతూ, అన్ని విషయాల్లో ప్రజలకు స్పష్టతను ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని చెప్పారు. ఇప్పుడు కేంద్ర మంత్రులను మనం కలిస్తే తప్పుడు సంకేతాలు వెళతాయని పలువురు వ్యాఖ్యానించారు. యనమల వ్యాఖ్యలతో చంద్రబాబు ఏకీభవించారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments